Homeఅంతర్జాతీయంIndia - Qatar : 8 మంది భారతీయులకు ఖతార్ లో మరణశిక్ష.. రంగంలోకి మోడీ...

India – Qatar : 8 మంది భారతీయులకు ఖతార్ లో మరణశిక్ష.. రంగంలోకి మోడీ సర్కార్.. ముందున్న మార్గాలివీ

India – Qatar : ఖతార్ కోర్టు 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించడం పెనుదుమారం రేపింది. ఖతార్ నిర్ణయంపై భారత్ సీరియస్ గానే తీసుకుంది. ఈ మేరకు ఖతార్ భారత్ సంబంధాలనే ఈ విషయంలో ఫణంగా పెట్టేందుకు కూడా రెడీ అయినట్టు సమాచారం. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి కూడా రంగంలోకి దిగి ఖతార్ కోర్టు వేసిన మరణశిక్షను రద్దు చేసే దిశగా ఖతార్ రాజుపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది.

ఇజ్రాయెల్ తరుఫున గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై 2022 ఆగస్టులో ఖతార్ అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు మరణశిక్ష విధించినట్లు అక్టోబర్ 26న వార్తలు వెలువడ్డాయి. నిందితులను కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్‌లుగా గుర్తించారు.

వీరంతా మాజీ ఇండియన్ నేవీ అధికారులు.. ప్రస్తుతం ఖతార్ లోని దోహాలోని దహ్రా గ్లోబల్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఖతారీ నావికాదళంలోకి స్టెల్త్ సబ్‌మెరైన్‌లను చేర్చే పనిలో వీరంతా పనిచేస్తున్నారు. వీరికి మరణశిక్ష పడడంపై భారత్ లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మోడీ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా దీనిపై స్పందించింది. మరణశిక్ష యొక్క తీర్పుతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. వివరణాత్మక తీర్పు కోసం వేచి చూస్తున్నాం” అని ప్రకటించారు.. “మేము వారి కుటుంబ సభ్యులు మరియు న్యాయ బృందంతో చర్చలు జరుపుతున్నాం. దీనిపై అన్ని చట్టపరమైన ఎంపికలను అన్వేషిస్తున్నాము” అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

మోడీ ప్రభుత్వం ఈ కేసుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. దానిని నిశితంగా పరిశీలిస్తుందని కూడా పేర్కొంది. మేము అన్ని రకాల కాన్సులర్.. చట్టపరమైన సహాయాన్ని అందజేస్తాం. మేము ఖతార్ అధికారులతో తీర్పు రివ్యూపై చేస్తున్నాం” అని విదేశాంగ శాఖ తెలిపింది.

ఇక ఖతార్ నేరారోపణల గురించి బహిరంగ ప్రకటనలు చేయలేదు. సైలెంట్ గా ఉంచింది. ఖతార్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ నిర్వహించిన విచారణ అపారదర్శకంగా ఉంది. ఆరోపణలు కూడా బహిరంగపరచబడలేదు. అభియోగాల సున్నితత్వం దృష్ట్యా, మధ్యప్రాచ్యం మరోసారి ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధంలో మునిగిపోయినప్పుడు తీర్పు అసందర్భ సమయంలో వచ్చింది.

– మరణశిక్షపై భారతదేశం ముందున్న సవాళ్లు ఏమిటి?

ఎనిమిది మంది భారతీయులు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసినందుకు అభియోగాలు మోపారని, వారికి విధించిన శిక్షలపై అప్పీలు చేసుకోవచ్చని కేసుపై సంక్షిప్తీకరించిన వ్యక్తి ధృవీకరించినట్లు భారత విదేశాంగ శాఖ నివేదించింది. ఖతార్‌లోని ఒక మాజీ భారత రాయబారి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన రిటైర్డ్ నేవీ సిబ్బందికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహాయం చేయగల నాలుగు మార్గాలను అన్వేషిస్తోంది. ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రంజాన్ సందర్భంగా వారికి క్షమాపణ లభించేలా మోడీ సర్కార్ చేయబోతున్నట్టు సమాచారం.

ఇక మరో మార్గం ఏంటంటే.. ఈ శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయడానికి భారతదేశం ఖతార్‌లోని ఉన్నత న్యాయ నిపుణులను సంప్రదించనుంది, అదే సమయంలో క్షమాభిక్ష హక్కు ఉన్న ఖతార్ ఎమిర్‌కు క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా వేయాలని తద్వారా భారతీయులను కాపాడాలని యోచిస్తోంది.

ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మన భారత పర్యటన సందర్భంగా 2015లో భారతదేశం -ఖతార్ మధ్య సంతకం చేసిన ఖైదీల బదిలీ ఒప్పందాన్ని ఇక్కడ ప్రస్తావించడం మరొక ఎంపికగా ఉంది.. ఈ ఒప్పందం ప్రకారం, నేరానికి పాల్పడిన వ్యక్తి జైలు శిక్షను అనుభవించడానికి అతని.. వారిని స్వదేశానికి బదిలీ చేయవచ్చు. అయితే ఇందుకు మరణశిక్షను జైలు శిక్షగా మార్చాల్సి ఉంటుంది.

ఇక చివరగా ఈ కేసుపై భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

ఈ మూడు నాలుగు మార్గాలతో మరణశిక్ష పడ్డ భారతీయ మాజీ అధికారులను బయటకు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఈ మేరకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version