ఒకే పీఎస్ లో 2 రోజుల్లోనే 22 కరోనా కేసులు

కరోనావైరస్ హైదరాబాద్ లో విలయతాండవం చేస్తోంది. డాక్టర్లను, నర్సులను, పోలీస్ శాఖను వణుకుపుట్టిస్తోంది… రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ అధికారులు…  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా.. ఇవాళ ఆ సంఖ్య  15 మందికి చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు వణికిపోతున్నారు.. గత మూడు రోజుల నుంచి జరుపుతున్న […]

Written By: Neelambaram, Updated On : June 12, 2020 8:53 pm
Follow us on

కరోనావైరస్ హైదరాబాద్ లో విలయతాండవం చేస్తోంది. డాక్టర్లను, నర్సులను, పోలీస్ శాఖను వణుకుపుట్టిస్తోంది… రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ అధికారులు…  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా.. ఇవాళ ఆ సంఖ్య  15 మందికి చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు వణికిపోతున్నారు.. గత మూడు రోజుల నుంచి జరుపుతున్న పరీక్షల్లో వరుసగా కరోనా కేసులు బయట పడుతున్నాయి. కనిపించని శత్రువు కరోనాతో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులను కరోనా వెంటాడడం ఆందోళన కలిగించే విషయం.. దీంతో అప్రమత్తమైన అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.