వీరిలో త్రీవమైన నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయడం లేదు. కేవలం జైళ్లలో సత్పప్రవర్తన కలిగిన ఖైదీలను మాత్రమే విడుదల చేయాలని న్యాయమూర్తి నిర్ణయించారు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనాతో తమకు విముక్తి కలిగినందుకు ఆనందపడాలో.. లేక కరోనా మహమ్మరి ప్రపంచాన్ని కబలిస్తున్నందుకు దుఃఖించాలో తెలియని పరిస్థితిలో ఖైదీలున్నారు. కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతుంటే.. కొందరు ఖైదీలు మాత్రం జైలు నుంచి కూడా విడుదలవడం గమనార్హం. న్యూజెర్సీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఖైదీలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.