Homeహెల్త్‌Parkinson's and Alzheimer's : పార్కిన్సన్స్, అల్జీమర్స్ చికిత్సలో కొత్త ఆశ పుడుతుందా?

Parkinson’s and Alzheimer’s : పార్కిన్సన్స్, అల్జీమర్స్ చికిత్సలో కొత్త ఆశ పుడుతుందా?

Parkinson’s and Alzheimer’s : పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధులు లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. మెదడు కణాలు క్రమంగా నాశనం కావడం ఈ వ్యాధులకు ప్రధాన కారణం. ఇది రోగి మానసిక సామర్థ్యం, శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు ఈ వ్యాధుల చికిత్సకు ఒక ముఖ్యమైన అడుగు వేశారు. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సకు కొత్త ఆశలను రేకెత్తిస్తూ, కణాల మరణాన్ని నిరోధించగల ఒక చిన్న అణువును ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

ఈ పరిశోధన “సైన్స్ అడ్వాన్సెస్” జర్నల్‌లో ప్రచురించారు. మెల్‌బోర్న్‌కు చెందిన వాల్టర్, ఎలిజా హాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (WEHI) శాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన ఆవిష్కరణను చేశారు. ఈ పరిశోధన ప్రత్యేకంగా కణాల మరణాన్ని నిరోధించే రసాయనాల కోసం వెతుకింది. ఇది భవిష్యత్తులో ఈ ప్రమాదకరమైన వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది.

Also Read : ఏ వైపు తిరిగి పడుకోవడం మంచిది?

నాడీ కణాలు చనిపోయే ప్రమాదం
న్యూరోడీజెనరేటివ్ వ్యాధులలో, మెదడులోని నాడీ కణాలు (న్యూరాన్లు) నెమ్మదిగా చనిపోతాయి. దీనివల్ల మెదడు పనితీరులో ఆటంకాలు ఏర్పడతాయి. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులలో ఈ ప్రక్రియ వేగంగా మారుతుంది. దీని కారణంగా రోగి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, శారీరక నియంత్రణ తగ్గుతుంది.

కణ మరణాన్ని నిరోధించే అణువు ఆవిష్కరణ
లక్షకు పైగా రసాయన సమ్మేళనాలను పరీక్షించిన తర్వాత ఈ పరిశోధన జరిగింది. దీనిలో కణాల మరణాన్ని సమర్థవంతంగా నిరోధించగల ఒక చిన్న అణువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అణువు BX అనే ప్రాణాంతక ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇది కణాల పవర్‌హౌస్‌లైన మైటోకాండ్రియాను దెబ్బతీయడం ద్వారా కణాలను చంపుతుంది. BX ప్రోటీన్‌ను నాశనం చేయడం ద్వారా, ఈ అణువు కణాలను కాపాడగలదు.

ప్రొఫెసర్ గుయిలౌమ్ లెసెస్నే చేసిన ప్రకటన
పరిశోధనా బృందం అధిపతి ప్రొఫెసర్ గుయిలౌమ్ లెసెస్నే ఈ ఆవిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, “BAX అనే ప్రాణాంతక ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని, దానిని నిష్క్రియం చేసే ఈ చిన్న అణువును కనుగొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది కణాల మరణాన్ని నిరోధించడమే కాకుండా భవిష్యత్తులో న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల చికిత్సలో కొత్త దిశను కూడా అందిస్తుంది ” అని అన్నారు.

మందుల ప్రాముఖ్యత
క్యాన్సర్ చికిత్సకు కణాల మరణాన్ని ప్రేరేపించే మందులు అభివృద్ధి జరుగుతున్న సమయంలో కణాల మరణాన్ని నిరోధించే మందులు న్యూరోడీజెనరేటివ్ వ్యాధులకు కొత్త, ముఖ్యమైన దశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఆవిష్కరణ పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషించే ఔషధాల అభివృద్ధికి దారితీయవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

ఒక కొత్త ఆశ కిరణం
ఈ పరిశోధన తర్వాత, డేవిసన్ ల్యాబ్ నుంచి ఒక పరిశోధకుడు కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పారు. అవేంటంటే. “మొదటిసారిగా మనం BX ప్రోటీన్‌ను మైటోకాండ్రియా నుండి దూరంగా ఉంచడం ద్వారా, ఈ అణువును ఉపయోగించడం ద్వారా కణాలను సజీవంగా ఉంచగలము. ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ కావచ్చు. ఇది భవిష్యత్తులో ఈ వ్యాధుల చికిత్సలో గణనీయమైన మార్పులను తీసుకురాగలదు.” ఈ అధ్యయనం పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో కొత్త దిశ, ఆశను సూచిస్తుంది. శాస్త్రవేత్తల ఈ ఆవిష్కరణ ఈ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆశాకిరణంగా మారడమే కాకుండా, ఔషధాల ఆవిష్కరణకు కొత్త మార్గాన్ని కూడా తెరవగలదు. భవిష్యత్తులో ఈ ఆవిష్కరణపై మరిన్ని పనులు జరిగితే ఈ ప్రమాదకరమైన వ్యాధుల చికిత్సలో ఇది ఒక ముఖ్యమైన దశగా నిరూపితం అవుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version