పరిశోధన: కరోనా వీరికి పెనుముప్పు.. ఇవి పాటించాలి

కరోనా ప్రపంచాన్ని కప్పేసింది. బయటి ప్రాంతాలకు వెళితే చాలు ఆ వ్యాధి చుట్టుముడుతోంది. కరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తుండడం అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రపంచంలో.. దేశంలో కేసులు ఉప్పెనలా నమోదవుతున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న దీని ధాటి నుంచి తప్పించుకోవడం అంత ఈజీకాదు. అయితే కరోనా యువకులను, చిన్నపిల్లలను పెద్దగా ప్రాణాపాయానికి గురిచేయడం లేదు. కానీ 50 ఏళ్లు దాటిన వారికి యమపాశంలో మారింది. కరోనా ముఖ్యంగా డయాబెటిస్(షుగర్) ఉన్నరోగులకు కరోనా సోకితే చాలా ప్రమాదం. […]

Written By: NARESH, Updated On : October 1, 2020 7:15 pm
Follow us on


కరోనా ప్రపంచాన్ని కప్పేసింది. బయటి ప్రాంతాలకు వెళితే చాలు ఆ వ్యాధి చుట్టుముడుతోంది. కరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తుండడం అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రపంచంలో.. దేశంలో కేసులు ఉప్పెనలా నమోదవుతున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న దీని ధాటి నుంచి తప్పించుకోవడం అంత ఈజీకాదు.

అయితే కరోనా యువకులను, చిన్నపిల్లలను పెద్దగా ప్రాణాపాయానికి గురిచేయడం లేదు. కానీ 50 ఏళ్లు దాటిన వారికి యమపాశంలో మారింది. కరోనా ముఖ్యంగా డయాబెటిస్(షుగర్) ఉన్నరోగులకు కరోనా సోకితే చాలా ప్రమాదం. చికిత్స తీసుకోకుంటే న్యూమోనియా, కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టైంలో గాయాలు కాకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధక పెంచే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తీవ్రమైన దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఈ కరోనా మరింత డేంజర్. వారినే ఎక్కువగా కబళిస్తోంది. కరోనా సోకితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం.

డయాబెటిస్ రోగులు ముఖ్యంగా బయటకు వెళ్లే సమయంలో మందంగా ఉండే మాస్క్ ను ధరించాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. సోషల్ డిస్టేన్స్ తప్పనిసరి. షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. శరీరంలో మార్పులను గమనించాలి. తేడా వస్తే డాక్టర్ ను సంప్రదించాలి.

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ ఉన్నప్పటికీ కరోనా బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.