ఐపీఎల్ పంజాబ్ క్రీడాకారుడు క్రిస్ గేల్కు నిర్వాహకులు ఫైన్ విధించారు. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 20వ ఓవర్ 4వ బంతికి ఆర్చర్ బౌలింగ్లో ఐటైన యూనివర్సర్ బాస్.. సెంచరీ మిస్సయిందన్న కోపంతో బ్యాట్ను విసిరాడు. లీగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గేల్ ఒప్పుకోవడంతో అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. అబుదాబి వేదికగా శుక్రవారం సాయంత్రం రాజస్థాన్, పంజాబ్ తలపడ్డాయి. సింగిల్స్, డబుల్స్తో క్రిస్ గేల్ అలరించాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 19.3వ బంతిని గేల్ భారీ సిక్సర్గా మలిచి 99 పరుగులకు చేరుకున్నాడు. ఒక పరుగుత తేడాతో వంద పరుగులు చేజారడంతో ఆవేశంతో బ్యాట్ను విసిరిగొట్టాడు.