దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు పతనమై 43,115 వద్ద డౌన్ అయ్యాయి. నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 12,619 వద్ద రన్ అవుతోంది. ఆసియావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇండస్ బ్యాంకు, యాక్సిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఢీలా పడ్డాయి. అయితే ఐషర్, టైటాన్, దివీస్, సన్ ఫార్మా, డాక్డర్ రెడ్డీస్ కాస్త లాభాన్ని చేకూర్చాయి. ఇక అపోలో హాస్పిటల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, పెట్రోనెట్, ఐబీ హౌసింగ్, ఐజీఎల్, బయోకాన్, కేడీలా హెల్త్ 41.2 శాతం మధ్య ట్రేడ్ అవుతున్నాయి. అటు అమెరికా సహా ఐరోపా మార్కెట్లు పతనమవుతున్నాయి. దీనికి కరోనా వైరస్ వ్యాప్తి కారణమేనని తెలుస్తోంది.