Guntur Kaaram: రాజమౌళి వల్లనే గుంటూరు కారం సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుందా?

తెలుగు ఇండస్ట్రీలలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా రాణిస్తున్న జక్కన్న ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ ను కూడా రుచి చూడలేదు. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా ఒక సినిమాను మించి మరొక సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది.

Written By: Suresh, Updated On : January 13, 2024 5:35 pm

Guntur Kaaram

Follow us on

Guntur Kaaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇప్పటికీ ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని చాటి చెప్పారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పాన్ వరల్డ్ స్టార్లుగా ఎదిగారంటే దానికి కారణం జక్కన్న. కానీ రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఈయన తో సినిమా చేయాలంటే కొన్ని సెంటిమెంట్లకు భయపడాల్సిందే. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

తెలుగు ఇండస్ట్రీలలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా రాణిస్తున్న జక్కన్న ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ ను కూడా రుచి చూడలేదు. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా ఒక సినిమాను మించి మరొక సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత సినిమా కచ్చితంగా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ ఎఫ్పటి నుంచో కొనసాగుతుంది. అయితే. ఇప్పటి వరకు ఈ సెంటిమెంట్ నుంచి ఏ హీరో కూడా తప్పించుకోలేకపోయాడు.

ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కానీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని చూస్తున్నారు ఎన్టీఆర్. కానీ కొందరు మాత్రం రాజమౌళితో సినిమా చేసిన తర్వాత చేయడానికంటే ముందు కూడా పరాజయాలను రుచి చూస్తారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్, రామచరణ్ లు జక్కన్నతో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ విజయాన్ని అందుకున్నా… వినయ విధేయ రామ సినిమాతో చరణ్ కు భారీ షాక్ తగిలింది.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సినిమా 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబుకు కూడా ఇదే షాక్ తగిలినట్టుగా ఉంది. రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించే కంటే ముందు గుంటూరు కారంతో మన ముందుకు వచ్చారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చింది. ఇక ఈ సినిమాకు మొదటి సినిమా నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది కావచ్చని అంటున్నారు కొందరు. అందరూ అనుకున్నట్టు ఇదే గనుక జరిగితే రాజమౌళి సెంటిమెంట్ మరోసారి నిజం అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి మహేష్ బాబు విషయంలో రాజమౌళి సెంటిమెంట్ ఎలా ఉండబోతుందో…ఇదిలా ఉంటే సై సినిమాకంటే ముందు శ్రీ ఆంజనేయం సినిమాతో నితిన్, చత్రపతి సినిమాకంటే ముందు చక్రం సినిమాతో ప్రభాస్, సింహాద్రి సినిమాకంటే ముందు నాగ సినిమాతో ఎన్టీఆర్ లు పరాజయం అందుకున్న విషయం తెలిసిందే.