Homeఎంటర్టైన్మెంట్హీరోలూ.. 'దసరా'కి ఖర్చీప్ లు ఎక్కువైపోయాయి !

హీరోలూ.. ‘దసరా’కి ఖర్చీప్ లు ఎక్కువైపోయాయి !

కోవిడ్ సెకెండ్ వేవ్ హడావుడితో టాలీవుడ్ కి సమ్మర్ కూడా దూరమైపోయింది. ఇప్పటికే సమ్మర్ సినిమాలు అన్నీ రిలీజ్ డేట్లను పోస్ట్ ఫోన్ చేసుకున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్ కూడా మరో మూడు నెలలు ఉండేలా కనిపిస్తోంది. ఎలాగూ సినిమాలు కూడా సగంలో ఆగిపోయాయి. కాబట్టి మళ్ళీ షూటింగ్ లు స్టార్ట్ అవ్వడానికి మరో మూడు నెలల సమయం.. అంటే, ఆగష్టులో మొదలయ్యే అవకాశం ఉంది.

ఇక ఆగష్టులో మొదలుపెట్టి.. చకచకా షూట్ ను పూర్తి చేసి దసరాకి రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాయి. మొత్తమ్మీద థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయినా, తమ సినిమాలను మాత్రం దసరాకే రిలీజ్ చేయాలని ఇప్పటికే చాలా మంది పెద్ద దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే అందరూ దసరాకే రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటే పోటీ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ పోటీలో సినిమాకి ఎంత గొప్ప పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాకపోవచ్చు.

కాబట్టి దసరాకి ఎక్కువ సినిమాలు రిలీజ్ కాకుండా, థియేటర్స్ ను చేతిలో పెట్టుకున్న బడా నిర్మాతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. కాకపోతే, ఎవరి సినిమా పోస్ట్ ఫోన్ చేయాలి, ఏ స్టార్ హీరోతో మీ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకో అని చెప్పాలి అని నిర్ణయించుకోలేక సతమతమవుతున్నారు. మెగా సినిమాలను అలాగే బన్నీ ‘పుష్ప’ను దసరా రేసులో నుండి బయటకు వెళ్ళమనలేరు. థియటర్స్ లో వాళ్లకు వాటా ఉంది కాబట్టి.

అదే విధంగా మహేష్ ‘సర్కారు వారి పాట’ను, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ను కూడా రేసు నుండి తప్పుకోండి అని చెప్పే దైర్యం లేదు. కచ్చితంగా ఈ రెండు సినిమాల్లో దసరాకి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఇదిలా వుంటే ఇప్పటకే అన్ని విధాలా రెడీగా వున్న బాలయ్య ‘అఖండ’ సినిమాను కూడా దసరా బరిలోకే దించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించారు. మరి ఈ సారి దసరా పోటీలో ఎవరు ఉంటారో, ఎవరు తప్పుకుంటారో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version