బ్రహ్మనందం తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ సంపాదించుకున్న హాస్య నటుడు వెన్నెల కిషోర్… ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, గోపీచంద్ ` సీటీ మార్ ` సినిమాల్లో నటిస్తున్న ఈ బిజీ నటుడు త్వరలో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో కూడా మరో మంచి పాత్రలో కనిపించనున్నాడు రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాల్లో కూడా అభినయించాడు .
టాలీవుడ్లో యమా బిజీగా ఉన్నవెన్నెల కిషోర్. దాదాపు ప్రతీ పెద్ద సినిమాలో కనిపిస్తూ నవ్వులు పూయిస్తున్నాడు. కాగా ఈ ఎన్ ఆర్ ఐ నటుడు లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమై ఉంటున్నాడు. విశేషం ఏమిటంటే వెన్నెల కిషోర్… కరోనా ప్రమాదాన్ని ముందే ఊహించి . హీరో నితిన్ అండ్ టీమ్ను పెను ప్రమాదం నుంచి బయటపడేశాడట.
అదెలా జరిగిందంటే చాలారోజుల కిందట ‘రంగ్ దే’ షూటింగ్లో ఉన్న సమయంలో హీరో నితిన్, వెన్నెల కిషోర్ ఈ వైరస్ గురించి చర్చించుకున్నారట …. నిజానికి ‘రంగ్ దే’ షూటింగ్ షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేశారు. అయితే నితిన్ అండ్ టీమ్ను వైరస్ వ్యాప్తి గురించి చెప్పి, షూటింగ్కు వేరే ప్లేస్ను ఎంచుకొమ్మని ఈ పరిస్థితుల్లో ఫారిన్ షూటింగ్స్ కరెక్ట్ కాదని .వెన్నెల కిషోర్ చెప్పడం జరిగింది .
ప్రసుతం లాక్డౌన్ టైమ్లో టీవీ షోలు, వెబ్ సిరీస్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్న వెన్నెల కిషోర్, రాబోయే పరిస్థితిని ముందే అర్థం చేసుకుని ఇంట్లో సరుకులను చాలా పొదుపు గా వాడు కుంటున్నాడట ..