శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ను విక్టరీ వెంకటేష్ విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర, నిర్మాత వి.సాయి అరుణ్ కుమార్, కో ప్రొడ్యూసర్స్ పి.శిరీష్ రెడ్డి, దేవినేని శ్రీనివాస్, నటులు శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ – “సముద్ర స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ‘జైసేన’ ది పవర్ ఆఫ్ యూత్ మూవీ ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఎపుడైనా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సాలిడ్ స్క్రిప్ట్ తో వస్తారు సముద్ర. ఈ సినిమాకి కూడా లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో ఒక మంచి స్క్రిప్ట్ తీసుకున్నారు. శ్రీకాంత్, సునీల్ తో పాటు చాలా మంది యంగ్ స్టర్స్ ఈ సినిమాలో నటించారు. నిర్మాణ విలువలు కూడా ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సినిమాలా ఉన్నాయి. దర్శకుడు సముద్రతో పాటు ఈ టీమ్ అందరికి ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.