Homeఎంటర్టైన్మెంట్Drushyam 2: మోహన్​లాల్​ యాక్టింగ్​ చూసి ఆశ్చర్యపోయా- వెంకీ

Drushyam 2: మోహన్​లాల్​ యాక్టింగ్​ చూసి ఆశ్చర్యపోయా- వెంకీ

Drushyam 2: విక్టరీ వెంకటేశ్​ హీరోగా దర్శకుడు జీతూ జేసెఫ్​ తెరకెక్కించిన సినిమా దృశ్యం2. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.  గతంలో వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 25న అమెజాన్​ ప్రైమ్​లో ఈ సినిమా స్ట్రీమింగ్​ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్​ మీడియాతో ముచ్చటించింది.

ఈ క్రమంలోనే వెంకీ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసేటప్పుడు తాను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని.. ఎంతా సరదాగా షూటింగ్​ గడిచిందని అన్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడతగ్గ మంచి సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను చేసిన రాంబాబు క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలతో.. జనం ముందుకు వస్తున్నామని.. ఆ పాత్రల్లో ఇప్పటికీ కనిపించని భయం ఉందని .. ఎప్పుడో జరిగిన హత్యకు సంబంధించిన విచారణ మళ్లీ ప్రారంభం కావడం.. పోలీసుల ఎత్తుకు రాంబాబు పై ఎత్తులు వేయడం…  సినిమా చాలా థ్రిల్లింగ్​గా ఉంటుందని వెంకీ అన్నారు.

drushyam

తన పాత్ర గురించి చెబుతూ.. సెట్​కు వెళ్లగానే తనలో రాంబాబు వచ్చేస్తాడని అన్నారు. తమిళ్​లో ఈ పాత్ర చేసిన మోహన్​లాల్​ను చూసి స్టన్​ అయినట్లు చె్పారు. చాలా సీన్స్​లో హదయానికి హద్దుకునేలా పాత్రలో జీవించారని అన్నారు. ఆ తర్వాత దర్శకుడు జీతూ మాట్లాడుతూ.. ఈ సినమాకు రాజమౌళి మాస్టర్​ పీస్​ అనే బిరుదు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇటువంటి మంచి సినిమాను ఎక్కువకాలం హోల్డ్​లో ఉంచకూడదనే ఉద్దేశంతోనే అమెజాన్​లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా లేరని.. అందుకే ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular