Vamshi Paidipally: ‘మున్నా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి చాలా తక్కువ సమయం లోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతో విజయాన్ని సాధించకపోయిన ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన బృందావనం, రామ్ చరణ్ తో చేసిన ఎవడు, నాగార్జునతో ఊపిరి సినిమాలను చేశాడు. మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు సినిమాకి రీమేక్ గా తెరకెక్కబోతుంది అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఆయన మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’ సినిమానే రీమేక్ చేస్తున్నాడని కొందరు అంటుంటే మరి కొంత మంది మాత్రం పడేస్తున్నారు.
ఇంకొందరైతే వంశీ పైడిపల్లి ఫ్రెష్ కథ తోనే సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వంశీ పైడిపల్లి కి మన స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతోనే తన గత చిత్రమైన వారసుడు తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ తో సినిమా చేశాడు.
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో ఈ సినిమా చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా తన కెరీర్లో చేసిన మంచి సినిమాలను చేశాడు. ఇక ఇలాంటి సందర్భంలో మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ఉండక మళ్ళీ బాలీవుడ్, కోలీవుడ్ హీరోలతో ఎందుకని జత కడుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా వంశీ పైడిపల్లి టాప్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. వారసుడు సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయనను తెలుగులో ఎవరు పట్టించుకోలేదు. ఇక ఎప్పటికైనా ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసి మరోసారి తన సత్తా చూపిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

