Urvashi Rautela: జగన్-పవన్ లలో ఎవరంటే ఇష్టం… స్టార్ లేడీ దిమ్మ తిరిగే ఆన్సర్!

తాజాగా ఇంటర్వ్యూలో ఊర్వశి రాతెలాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీకు సీఎం జగన్, పవన్ కళ్యాణ్ లలో ఎవరు ఇష్టం? అని అడిగారు.

Written By: Shiva, Updated On : July 31, 2023 10:43 am

Urvashi Rautela

Follow us on

Urvashi Rautela: బాలీవుడ్ మోడల్ అండ్ యాక్ట్రెస్ ఊర్వశి రాతెలా ఇటీవల సంచలన ట్వీట్ చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి. అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అని ఊర్వశి చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఊర్వశికి తెలుసు పవన్ ఏపీ నెక్స్ట్ సీఎం అని. అందుకే అలా ట్వీట్ చేశారని సంబరపడిపోయారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేశారు.

ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో ఊర్వశి రాతెలాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీకు సీఎం జగన్, పవన్ కళ్యాణ్ లలో ఎవరు ఇష్టం? అని అడిగారు. ఈ ప్రశ్నకు ఊర్వశి రాతెలా తడుముకోకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. సీఎం జగన్ కంటే తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ఊర్వశి రాతెలా చెప్పుకొచ్చారు. ఊర్వశి రాతెలా సమాధానం మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.

కాగా లేటెస్ట్ రిలీజ్ బ్రో మూవీలో ఊర్వశి రాతెలా ఐటెం సాంగ్ చేశారు. పవన్ తో కలిసి పని చేసింది కొద్దిరోజులే అయినా… ఆయనకు ఊర్వశి రాతెలా ఫ్యాన్ అయిపోయారు. ఇక ఊర్వశి రాతెలా సౌత్ లో బిజీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో బాస్ పార్టీ సాంగ్ లో ఊర్వశి అలరించారు. బాస్ పార్టీ సాంగ్ వాల్తేరు వీరయ్య సినిమాకు హైలెట్ గా మారింది.

అలాగే రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ స్కందలో ఊర్వశి రాతెలా ఒక సాంగ్ చేయనుంది. స్కంద విడుదలకు సిద్ధం అవుతుండగా ఊర్వశి సాంగ్ పై ఆసక్తి నెలకొంది. స్కంద చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. గత ఏడాది విడుదలైన లెజెండ్ మూవీలో ఊర్వశి హీరోయిన్ గా చేసింది. వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా మారి ఈ చిత్రం చేశాడు. లెజెండ్ చిత్రానికి ఊర్వశి భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.