బాలీవుడ్‌ హాట్ బ్యూటీ.. టాలీవుడ్‌ ఎంట్రీ!

టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రంగ ప్రవేశం చేయనుంది. మిస్‌ యూనివర్స్‌ 2015లో పాల్గొని బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఊర్విశి రౌతేలా తొందర్లోనే తన హాట్ హాట్‌ అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. హిందీలో పలు సినిమాలు చేసిన ఊర్వశి వాటి కంటే స్పెషల్‌ సాంగ్స్‌,స్టేజ్‌ పెర్ఫామెన్స్‌లతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. పలువురు హీరోలతో పాటు యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌తో ఎఫైర్ తో ఆమె పేరు బాలీవుడ్‌లో తరచూ వార్తల్లో నానింది. అడగకుండానే అందాలు […]

Written By: Neelambaram, Updated On : August 18, 2020 6:04 pm
Follow us on


టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రంగ ప్రవేశం చేయనుంది. మిస్‌ యూనివర్స్‌ 2015లో పాల్గొని బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఊర్విశి రౌతేలా తొందర్లోనే తన హాట్ హాట్‌ అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. హిందీలో పలు సినిమాలు చేసిన ఊర్వశి వాటి కంటే స్పెషల్‌ సాంగ్స్‌,స్టేజ్‌ పెర్ఫామెన్స్‌లతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. పలువురు హీరోలతో పాటు యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌తో ఎఫైర్ తో ఆమె పేరు బాలీవుడ్‌లో తరచూ వార్తల్లో నానింది. అడగకుండానే అందాలు ఆరబోసే ఊర్వశి పేరు కొన్ని రోజులుగా టాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది.

Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

‘పుష్ప’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కోసం ఆమెను సంప్రదించారన్న వార్తలు వచ్చాయి. దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ హాట్‌ బ్యూటీ టాలీవుడ్‌లో అడుగు పెట్టడం ఖాయమైంది. యువ డైరెక్టర్ సంపత్‌ నంది పట్టుబట్టి ఆమెను తెలుగుకు పరిచయం చేయబోతున్నాడు. అయితే, ఆయన దర్శకత్వంలో ఊర్వశి సినిమా చేయడం లేదు. సంపత్‌ కథతో మోహన్‌ భరద్వాజ్‌ తెరకెక్కించనున్న ‘బ్లాక్‌రోజ్‌’ అనే మూవీలో రౌతేలా కథానాయికగా ఎంపికైంది. సంపత్‌…కేవలం ఊర్వశిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాడు. నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి…ఊర్వశి డేట్స్‌ సంపాదించాడు. దాంతో, రీసెంట్‌గా ఈమూవీకి కొబ్బరికాయ కూడా కొట్టారు. కాగా, సంపత్‌ అందించిన మరో కథతో ఓ సినిమా కూడా మొదలైంది. ఆయన దగ్గర అసోసియేట్‌గా పని చేసిన అశోక్‌ తేజ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి కె.కె. రాధా మోహన్‌ నిర్మాత. సంపత్‌ కథ, కథనం, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే గోపీచంద్‌తో ‘సీటీమార్’తో బిజీగా ఉండడంతో తన వద్ద ఉన్న రెండు కథలను నంది వేరే వాళ్లకు ఇచ్చేశాడని తెలుస్తోంది.