Chandrakanth: సీరియల్ నటుడు చందు మరణం … నమ్మిన బంటువు పోయావంటూ తీవ్ర భావోద్వేగంలో కార్తీకదీపం నటి!

చంద్రకాంత్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే పవిత్ర తో పరిచయం ఏర్పడిందో .. భార్య, పిల్లలను దూరం పెట్టాడు. త్రినయని సీరియల్ లో పవిత్ర, చంద్రకాంత్ కలిసి నటించారు.

Written By: S Reddy, Updated On : May 19, 2024 6:07 pm

Chandrakanth

Follow us on

chandrakanth: సీరియల్ నటులు పవిత్ర జయరామ్, చంద్రకాంత్ ల వరుస మరణాలు కలిచివేశాయి. టీవీ పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పవిత్ర జయరామ్ మే 12న రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డారు. తన ప్రేయసి పవిత్ర తన కళ్ల ముందే చనిపోవడం చూసిన చంద్రకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చంద్రకాంత్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే పవిత్ర తో పరిచయం ఏర్పడిందో .. భార్య, పిల్లలను దూరం పెట్టాడు. త్రినయని సీరియల్ లో పవిత్ర, చంద్రకాంత్ కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దాదాపు ఆరేళ్లుగా పవిత్ర తో కలిసి ఉంటున్నారు చందు. గత సోమవారం బెంగళూరు వెళ్లి వస్తుండగా పవిత్ర, చంద్రకాంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో పవిత్ర గుండెపోటుతో అక్కడికక్కడే కన్నుమూసింది.

చిన్న చిన్న గాయలతో బయటపడ్డ చంద్రకాంత్ ప్రేయసి చనిపోవడంతో తీవ్ర డిప్రెషన్ కి లోనయ్యారు. పవిత్ర చనిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తన భాదను తెలియజేస్తూ వచ్చాడు. ఆమె లేకుండా బ్రతకలేను, పిచ్చోడిని అయిపోతానేమో అంటూ తన సన్నిహితులకు చెప్పి మరీ సూసైడ్ చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయాడు. దీంతో అతని తోటి నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నారు. చంద్రకాంత్ ప్రస్తుతం కార్తీకదీపం 2 లో బంటు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పారిజాతం దగ్గర పని చేస్తూ .. ఆమెకు నమ్మిన బంటుగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. కాగా పారిజాతం పాత్రలో నటిస్తున్న నటకుమారి .. తన తోటి నటుడు చంద్రకాంత్ మరణం పై ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమెకు బంటు తో ఉన్న అనుబంధం తెలియజేస్తూ కొన్ని వీడియోలు షేర్ చేసింది. బంటూ ని మిస్ అవుతున్నాం అంటూ భావోద్వేగానికి గురైంది.