Photo Story: భరతనాట్యం చేస్తున్న ఈ క్యూటీ ఇప్పుడో హాట్ బ్యూటీ… ఎవరో తెలిశాక షాక్ అవుతారు!

పట్టుదలతో ప్రయత్నం చేస్తే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తుంది. మనం పైన చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు .. అందాల తార ఐశ్వర్య మీనన్. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య మీనన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.

Written By: S Reddy, Updated On : May 29, 2024 7:41 pm

Photo Story

Follow us on

Photo Story: ఈ ఫొటోలో చూడముచ్చటగా కనిపిస్తున్న చిన్నారి, నాట్యమయూరి ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్. కెరీర్ బిగినింగ్ లో ప్రాధాన్యత లేని పాత్రలు చేసింది. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన అమ్మడు హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్యూటీ ఇప్పుడిపుడే హీరోయిన్ గా ఎదుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరోయిన్ కి ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. కేవలం టాలెంట్ ని నమ్ముకొని ముందుకు వెళుతుంది.

పట్టుదలతో ప్రయత్నం చేస్తే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తుంది. మనం పైన చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు .. అందాల తార ఐశ్వర్య మీనన్. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య మీనన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. నటనపై ఆసక్తితో పరిశ్రమలో అడుగు పెట్టింది. కదలిల్ సోదప్పవదు ఎప్పడి సినిమాతో అరంగేట్రం చేసింది. కొంతకాలం సపోర్టింగ్ రోల్స్ చేసిన ఐశ్వర్య మీనన్ లవ్ ఫెయిల్యూర్ సినిమాతో కథానాయికగా మారింది.

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన స్పై చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది అమ్మడు. తాజాగా యంగ్ హీరో కార్తీకేయ ‘ భజే వాయువేగం ‘ సినిమాతో మెప్పించేందుకు రెడీ అయింది. ఈ చిత్రంలో కార్తికేయకు జంటగా ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మే 31న రిలీజ్ కానుంది.

ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను భరతనాట్యం డాన్సర్ అని, చదువుకునే రోజుల్లో ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించినట్లు ఆమె తెలిపారు. అంతేకాదు తెలుగులో ప్రస్తుతం ఆమె మూడు సినిమాలు చేస్తున్నానని, ఆల్రెడీ ఒకటి ఎనౌన్స్ చేయబోతున్నారని, ఇంకో రెండు చర్చల దశలో ఉన్నాయని పేర్కొంది. ఇక తమిళంలో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నట్టు వెల్లడించింది.