Homeఎంటర్టైన్మెంట్వెబ్ సీరిస్ వైపు చూస్తున్న టాలీవుడ్ స్టార్స్

వెబ్ సీరిస్ వైపు చూస్తున్న టాలీవుడ్ స్టార్స్


సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిజిటల్ హవా కొనసాగుతోంది. లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలను వీక్షిస్తున్నారు. రెండునెలలు సినిమా థియేటర్లు మూతపడటంతో ఇంటి నుంచి సినిమాలను చూసేందుకు సగటు ప్రేక్షకుడు అలవాటు పడిపోయాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాలన్నీ డైరెక్టుగా ఓటీటీల్లో రిలీజవుతుండటం వీటికి మరింత కలిసొస్తుంది. టీవీల్లోనూ పాత షోలే రిపిట్ చేస్తుండటం, కొత్తతరహాలో వెబ్ సీరిసులు వస్తుండటంతో ప్రతీఒక్కరు వీటిని ఆదరిస్తున్నారు. దీంతో టాలీవుడ్ స్టార్లు కూడా వెబ్ సీరిసులను నిర్మించడంతోపాటు నటించేందుకు సిద్ధమవుతున్నారు. వెబ్ సీరిసులను తక్కువ ఖర్చుతో నిర్మించి ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశం ఉండటంతో వీటిపై టాలీవుడ్లోని క్రేజీ స్టార్లు దృష్టిసారిస్తున్నారు.

ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సినిమాల్లో, వెబ్ సీరిసుల్లో నటిస్తూ రెండుచేతుల సంపాదిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్నిట్లోనూ వెబ్ సీరీసుల హవా కొనసాగుతోంది. వీటిల్లో ఆయా పరిశ్రమలకు చెందిన క్రేజీ స్టార్లు నటిస్తుండటంతో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే సీనీయర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా నిర్మిస్తున్న ‘క్వీన్’ వెబ్ సీరిసులో నటించింది. ఈ వెబ్ సీరిసులో తమిళనాడులో విశేష ప్రజాదరణ లభించింది. అదేవిధంగా నమిత, ప్రియమణి వెబ్ సీరిసుల్లో నటించేందుకు సిద్ధపడుతున్నారు. తెలుగులోనూ పలువురు స్టార్లు వెబ్ సీరిసుల్లో నటించేందుకు సిద్ధపడుతున్నారు. అక్కినేని కోడలు సమంత అమెజాన్ ది ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. సమంత బాటలోనే కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా, షాలినీ పాండే తదితర స్టార్స్ పయనించేందుకు సిద్ధపడుతున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-దర్శకుడు సుకుమార్ కాంబోలో ఓ వెబ్ సీరిసు తెరకెక్కనుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ కోసం వీరిద్దరి కలిసి పనిచేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది. దీంతో మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కూడా వెబ్ సీరీసులను నిర్మించేందుకు సిద్ధపడుతుండట. మెగా హీరోలతో వెబ్ సీరిసులను నిర్మించి ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ బడా నిర్మాత అల్లు అరవింద్ చేపట్టిన ‘ఆహా’ ఓటీటీ కోసం రెండు వెబ్ సీరీసుల్లో నటించనున్నారట. విజయ్ దేవరకొండ ఇప్పటికే ‘ఆహా’కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్మాథ్ ఓ బోల్డ్ వెబ్ సీరిసు తెరకెక్కించేందుకు సిద్ధపడుతున్నారని టాక్ విన్పిస్తుంది. లాక్డౌన్ సమయంలో ఇందుకోసం స్క్రీప్ట్ కూడా రెడీ చేసుకున్నారట. ‘పైటర్’ మూవీ పూర్తికాగానే ఈ వెబ్ సీరిస్ పట్టాలెక్కనుందట. ఇలా టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా వెబ్ సిరీసులవైపు అడుగులు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular