NTR: ఇటీవల కాలంలో టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల జోరు పెరుగుతోంది. ఈ బాటలోనే నడుస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు బన్ని. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరికి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. బన్నీ రిజెక్ట్ చేసిన ఓ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

యంగ్టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్బాస్టర్ హిట్ కొట్టింది. ఇటీవల ఎన్టీఆర్30 హ్యాజ్టాగ్తో ఓ ప్రాజెక్టును ప్రకటించారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. ఫిబ్రవరి తర్వాత రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. స్టూడెంట్స్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్ననట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సినిమా కథను కొరటాల శివ తొలుత అల్లు అర్జున్కి వినిపించగా.. నా పేరు సూర్య సినిమా ఇదే కోవకు చెందడంవల్ల.. ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఎన్టీఆర్కు స్క్రిప్ట్ వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ యాంగర్ మేనేజ్మెంట్తో హిట్ కొడతాడా ? అనేది చూడాలి.
కాగా, పుష్ప సినిమాతో వస్తోన్న బన్నీ.. రోజుకో పోస్టుతో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ వరుస ప్రమోషన్స్తో బజ్ క్రియేట్ చేస్తున్నారు. డిసెంబరులో పుష్ప సినిమా విడుదలకు సిద్ధం కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా రంగంలోకి దిగనుంది.