Bigg Boss 7 Telugu: ఫినాలే రేసులో కీలక పరిణామం… రైతుబిడ్డకు యావర్ సపోర్ట్!

టాస్క్ లో రేస్ లో కొనసాగుతున్న అమర్, గౌతమ్, యావర్, అర్జున్, ప్రశాంత్ లు పోటీ పడ్డారు. కాగా వీళ్ళకి '' తప్పించుకో రాజా'' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో పోటీ దారులు తమ ముందున్న ఇసుకను తొలుచుకుని అవతలికి వెళ్లి.

Written By: NARESH, Updated On : November 30, 2023 6:00 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే అస్త్ర రేస్ హోరా హోరీ గా సాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 6 టాస్కులు బిగ్ బాస్ నిర్వహించారు. ఇందులో తక్కువ స్కోర్ సాధించిన కారణంగా శివాజీ,శోభా, ప్రియాంక లు ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నారు. అయితే అమర్ దీప్ అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించి స్కోర్ బోర్డు లో టాప్ లో ఉన్నాడు. కాగా ఫినాలే అస్త్ర రేస్ లో భాగంగా మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో రేస్ లో కొనసాగుతున్న అమర్, గౌతమ్, యావర్, అర్జున్, ప్రశాంత్ లు పోటీ పడ్డారు. కాగా వీళ్ళకి ” తప్పించుకో రాజా” అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో పోటీ దారులు తమ ముందున్న ఇసుకను తొలుచుకుని అవతలికి వెళ్లి.. తమ కాలికి వేసి ఉన్న గొలుసు తాళంతో తీసేసి గంట కొట్టాలి. ఇందులో ప్రశాంత్ అతి తక్కువ సమయంలోనే ఇసుకని తొలుచుకుని వెళ్లి గంట కొట్టేసాడు.

తర్వాత యావర్ తాళం తీసుకునే క్రమంలో ఆలస్యం చేశాడు. ఇక అమర్ వెళ్లి గంట కొట్టేసాడు. తర్వాత యావర్ గంట కొట్టాడు. ఇక అర్జున్ తాళం తీసి పెట్టాల్సిన చోట పెట్టలేదు అంటూ సంచాలకుల పై అసహనం వ్యక్తం చేశాడు. ఇక తర్వాత యావర్ ‘ నాకు లక్ ఫేవర్ చేయలేదు’ అంటూ అమర్ తో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫినాలే రేస్ నుంచి మరో ఇంటి సభ్యులు తప్పించే సమయం వచ్చిందంటూ బిగ్ బాస్ చెప్పారు.

అయితే స్కోర్ బోర్డు లో తక్కువ పాయింట్లు ఉండటంతో యావర్ ని రేస్ నుంచి తప్పిస్తూ .. అతడు సాధించిన పాయింట్లలో సగం అంటే 130 పాయింట్లు ఎవరికైనా ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పారు. వెంటనే ప్రశాంత్ పేరు చెప్పాడు యావర్. తన పాయింట్లు ప్రశాంత్ కి ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రశాంత్ 550 పాయింట్లకు ఈ 130 కలిపితే 680 పాయింట్లతో రెండో స్థానంలోకి వెళ్ళిపోతాడు ప్రశాంత్.