సాయం చేయడంలో ముందున్న సందీప్ కిషన్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ హీరో సందీప్ కిషన్ తన పరిధిలో చేతనైనంత మందికి సాయం చేస్తున్నాడు. కరోనా మహమ్మారి పై పోరాటంలో తన వంతు సాయంగా సందీప్ కిషన్ రూ. 3 ల‌క్ష‌లు విరాళాన్ని సి సి సి కి అందించడం చేసాడు. అదేవిధంగా తన ‘వివాహ భోజనంబు రెస్టారెంట్‌’ లో పనిచేస్తున్న 500 పైగా ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తూ అందరి మన్ననలు అందుకొంటున్నాడు మళ్ళీ తాజాగా కొన్ని […]

Written By: Neelambaram, Updated On : April 10, 2020 5:18 pm
Follow us on


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ హీరో సందీప్ కిషన్ తన పరిధిలో చేతనైనంత మందికి సాయం చేస్తున్నాడు. కరోనా మహమ్మారి పై పోరాటంలో తన వంతు సాయంగా సందీప్ కిషన్ రూ. 3 ల‌క్ష‌లు విరాళాన్ని సి సి సి కి అందించడం చేసాడు. అదేవిధంగా తన ‘వివాహ భోజనంబు రెస్టారెంట్‌’ లో పనిచేస్తున్న 500 పైగా ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తూ అందరి మన్ననలు అందుకొంటున్నాడు మళ్ళీ తాజాగా కొన్ని వేలమందికి మాస్కులు మరియు శానిటైజర్ లను సందీప్ కిషన్.అందించడం జరిగింది. ఇక తన అభిమాని కడప శ్రీను ఆకస్మిక మరణం తరువాత, అతని కుటుంబానికి అండగా నిలబడుతూ ప్రతి నెల ఆ కుటుంబ ఆర్ధిక అవసరాలు నిమిత్తం నెల నెల 10,000 వేలు అందిస్తున్నాడు.. ఈ లాక్ డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సందీప్ కిషన్ కడప శ్రీను తల్లికి పది వేలు పంపించడం జరిగింది.. కడప శ్రీను తల్లికి ఏ అవసరం ఉన్నా..పెద్ద కొడుకుగా ఆమెకు అండగా నిలబడుతూ సందీప్ కిషన్ తన మంచి మనసు నిరూపించుకున్నాడు.

ఇగత ఏడాది `నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన సందీప్ కిష‌న్ ప్రస్తుతం `A1 ఎక్స్‌ప్రెస్‌` అనే సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథా నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలను ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ వహించడం జరుగుతోంది .