Sreemukhi: వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’?

బుల్లితెరపైన స్టార్ యాంకర్ గానే కాకుండా.. వెండితెరపై హీరోయిన్ గానూ నటిస్తూ అలరిస్తోంది శ్రీముఖి. రెండు పడవల ప్రయాణం చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్ ’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఒక పడుచు యువతికి పెళ్లి అయ్యి పిల్లలున్న ముగ్గురు అంకుల్స్ లైన్ వేసి ఆకర్షించే కథాంశంతో ‘క్రేజీ అంకుల్స్’ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ గా యాంకర్ శ్రీముఖి హాట్ గా నటించగా.. అంకుల్స్ గా మనో, భరణీ, […]

Written By: NARESH, Updated On : August 18, 2021 7:19 pm
Follow us on

బుల్లితెరపైన స్టార్ యాంకర్ గానే కాకుండా.. వెండితెరపై హీరోయిన్ గానూ నటిస్తూ అలరిస్తోంది శ్రీముఖి. రెండు పడవల ప్రయాణం చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్ ’ మూవీ వివాదంలో చిక్కుకుంది.

ఒక పడుచు యువతికి పెళ్లి అయ్యి పిల్లలున్న ముగ్గురు అంకుల్స్ లైన్ వేసి ఆకర్షించే కథాంశంతో ‘క్రేజీ అంకుల్స్’ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ గా యాంకర్ శ్రీముఖి హాట్ గా నటించగా.. అంకుల్స్ గా మనో, భరణీ, రాజారావీంద్ర నటించారు. అయితే అభ్యంతరకర సన్నివేశాలు ఇందులో ఉన్నాయని.. మహిళలను కించపరిచేలా సినిమా ట్రైలర్ లో చూపించారని తాజాగా మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే క్రేజీ అంకుల్స్ సినిమాను అడ్డుకోవాలంటూ మహిళా సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ సినిమా ఈనెల 19న రేపు విడుదల కానున్న దృష్ట్యా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.

ఇప్పటికే బుల్లితెరపై ఎంతో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు హీరోయిన్ గానూ అంతే హాట్ గా నటించడం మొదలుపెట్టింది. గతంలో ‘ప్రేమ్ ఇష్క్ కాదల్’ అనే సినిమాలో శ్రీముఖి నటించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ వివాదాస్పదం కావడంతో ఇప్పుడు విడుదల అవుతుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.