Sr NTR -Rajasulochana : వేశ్యగా ముద్రపడిన నటిని గొప్ప హీరోయిన్ గా మార్చిన సీనియర్ ఎన్టీఆర్.. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా..?

ఇక ఆయన అటు పౌరాణిక పాత్రలను పోషిస్తూనే, ఇటు జానపద సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన మేటి నటన తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.

Written By: NARESH, Updated On : October 22, 2023 4:36 pm
Follow us on

Sr NTR -Rajasulochana : సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు( ఎన్టీయార్) చేసినటువంటి పాత్రలు ఎవరు చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకి సినిమా అభిమానులు బ్రహ్మా రథం పట్టారనే చెప్పాలి.ఇక ఆయన అటు పౌరాణిక పాత్రలను పోషిస్తూనే, ఇటు జానపద సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన మేటి నటన తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.

అయితే అదే సమయంలో రాజ సులోచన చాలా సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఈమె పేరు ముందుగా రాజలోచన అయితే స్కూళ్లో చదువుకున్నప్పుడు ఆమె పేరు తప్పుగా పడి రాజసులోచన అయింది. ఇక అప్పటి నుంచి ఆమె అదే పేరుతో కంటిన్యూ అయింది.ఈమె కి చిన్నప్పటి నుంచే మంచి డ్యాన్సర్ అవ్వాలనే కోరిక ఉండేది దానికి తగ్గట్టుగానే ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని కోరుకొని ఆమె డ్యాన్స్ తో చాలామంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది.ఆమెకి ఒక సినిమాలో వేశ్య పాత్ర చేసే అవకాశం వచ్చింది ఆ పాత్రలో నటించి మెప్పించిన తరువాత ఆమెకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే లభించింది కానీ, ఇక అప్పటి నుంచి ఆమెకి తరచుగా ఆ పాత్రలే రావడం ఆ పాత్రలకే ఆమె పరిమితం అవడం జరిగింది.

ఇక దీంతో ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎదగాలి అనుకొని వచ్చిన కూడా ఇక్కడ అలా జరగపోవడం తో ఆమె కల రోజు రోజుకి బీటలు వారిపోయింది. ఇక తను ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం అనుకున్న సమయంలో ఎన్టీఆర్ లాంటి ఒక దిగ్గజా నటుడి పక్కన టైగర్ రాముడు అనే సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం రావడం తో హీరోయిన్ గా ఎన్టీయార్ ఆమె కి ఒక మంచి లైఫ్ ఇచ్చారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రాజసులోచనకి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి.ఇక ఎన్టీఆర్ తో కూడా ఒక నాలుగు సినిమాల్లో నటించి తనదైన మేటి నటనను తెలుగు ప్రేక్షకులకు చూపిస్తూ ఘన కీర్తిని కూడా అందుకుంది.

అలా ఎన్టీఆర్ ఒకవైశ్యపాత్రకి పరిమితమైన రాజ సులోచన ని హీరోయిన్ గా చేసి ఆమె కి మంచి సక్సెస్ లు అందించారు. ఇక ఇదే క్రమంలో ఆమె నాగేశ్వరరావు పక్కన కూడా చాలా సినిమాల్లో నటించి తన మేటి నటనతో నాగేశ్వరావు పక్కన ఒక స్టార్ హీరోయిన్ గా కూడా వెలుగొందుతుంది… ఇక ఎన్టీఆర్ కి రాజసులోచనకి మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఆ తర్వాత బాగా పాపులర్ అయింది అది ఏంటి అంటే ఒక రోజు జరిగిన షూటింగ్ లో భాగంగా వీళ్ళిద్దరూ ఒక సీన్ ని రిహార్సల్స్ చేస్తూ తిట్టుకుంటున్న సమయంలో అది చూసిన డైరెక్టర్ వీళ్ళిద్దరికీ ఏదో గొడవ జరిగిందని అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది సార్, ఏమైంది మేడం అంటూ అడిగాడంట దాంతో వాళ్ళిద్దరూ నవ్వుకొని సీన్ బాగా రావడానికి రిహార్సల్ చేస్తున్నాం అంటూ కామెడీ చేశారు. దాంతో ఆ డైరెక్టర్ ఒకసారి షాక్ నుంచి తేరుకోేని కూల్ అయిపోయాడు….