Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా సెన్సేషన్… ఈ బ్యాంకాక్ పిల్ల ఎవరో మీకు తెలుసా?

ఈసారి బిగ్ బాస్ మేకర్స్ ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్స్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ వీడియోలతో పిచ్చ పాపులారిటీ రాబట్టిన బ్యాంకాక్ పిల్లను హౌస్లోకి పంపుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లో బ్యాంకాక్ పిల్ల ఒకరనే న్యూస్ సంచలనం రేపుతోంది.

Written By: S Reddy, Updated On : July 31, 2024 4:06 pm
Follow us on

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ నెల మొదటి వారంలో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తుంది. కాగా ఇప్పటికే బిగ్ బాస్ మేనియా ఆడియన్స్ ని ఊపేస్తోంది. ఇక సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుంది. తాజాగా మరో క్రేజీ యూట్యూబర్ పేరు బాగా వినిపిస్తోంది.

ఆమె ఎవరో కాదు శ్రావణి సామంతపూడి. ఆమె అసలు పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ బ్యాంకాక్ పిల్ల అంటే ఇట్టే అర్థమవుతుంది. బ్యాంకాక్ లో ఉంటూ అక్కడ వింతలు, విశేషాలు వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. విజయనగరానికి చెందిన శ్రావణి తన యాసలో మాట్లాడుతూ వీడియోలు చేస్తుంది. ఆమెకు యూట్యూబ్ లో 2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమె చేసే వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఆమెకున్న పాపులారిటీ నేపథ్యంలో.. బిగ్ బాస్ లో అడుగుపెడితే షో కి కలిసి వస్తుంది అని మేకర్స్ భావిస్తున్నారట. సీజన్ 8 లో పార్టిసిపేట్ చేసేందుకు ఆమెను టీం సంప్రదించారట. ఇందుకోసం బ్యాంకాక్ పిల్లకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారట. రాను పోను ఫ్లైట్ ఖర్చులతో సహా ఆఫర్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల బిగ్ బాస్ తెలుగు 8 లోగో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈసారి ఆటలో అంతులేని ఎంటర్టైన్మెంట్ ఉంటుందని లోగో చూసి అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రేక్షకులకు అడుగడునా సర్ప్రైజ్ లు, ఊహించని షాక్ లు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం స్టార్ మా లో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ రన్ అవుతుంది. ఈ షో ఆగస్టు నెలాఖరుకు పూర్తి కానుంది. ఇది ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. బిగ్ బాస్ ఆడియన్స్ లో ఆతృత అంతకంతకు పెరుగుతూ పోతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ పరిశీలిస్తే … యాంకర్ రీతూ చౌదరి, ఖయ్యూం అలీ, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లు, కమెడియన్ యాదవరాజు, కుమారి ఆంటీ, యాంకర్ వింధ్య విశాఖ, యాంకర్ విష్ణు ప్రియ, ఆర్టిస్ట్ అక్షిత, మై విలేజ్ షో అనిల్, అమృత ప్రణయ్ వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ వీరిలో ఎవరెవరో హౌస్ లో అడుగుపెడతారో లాంచింగ్ ఎపిసోడ్ లోనే పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ సీజన్లో రెండు హౌస్ లు ఉంటాయని తెలుస్తోంది.

హీరో నాగార్జున వరుసగా ఆరో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 3తో హోస్ట్ గా మారిన ఆయన కొనసాగుతున్నారు. ఈసారి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. సీజన్ మొత్తానికి కలిపి రూ. 25 కోట్లు ఇస్తున్నారని సమాచారం. నాగార్జున ఓ సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.