సునీత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రతి రోజు అరగంట పాటు..!

సింగర్ గానే కాకుండా తన గాత్రంతో అలాగే తన చీరకట్టుతో సునీత గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తన సెకెండ్ పెళ్లిని ఎంజాయ్ చేస్తున్న సునీత, తన ఎంజాయ్ మెంట్ ను అందరికీ పంచడానికి రెడీ అవుతుంది. నిజానికి ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా గందరగోళమే కనిపిస్తుంది. మొత్తమ్మీద కరోనా సెకండ్ వేవ్ జనం జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. లోకం అంతటా కమ్ముకున్న విషాద వార్తలతో ప్రజలు కలత చెందకుండా వారిలో నవ్వులను […]

Written By: NARESH, Updated On : May 9, 2021 4:13 pm
Follow us on

సింగర్ గానే కాకుండా తన గాత్రంతో అలాగే తన చీరకట్టుతో సునీత గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తన సెకెండ్ పెళ్లిని ఎంజాయ్ చేస్తున్న సునీత, తన ఎంజాయ్ మెంట్ ను అందరికీ పంచడానికి రెడీ అవుతుంది. నిజానికి ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా గందరగోళమే కనిపిస్తుంది. మొత్తమ్మీద కరోనా సెకండ్ వేవ్ జనం జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.

లోకం అంతటా కమ్ముకున్న విషాద వార్తలతో ప్రజలు కలత చెందకుండా వారిలో నవ్వులను ఆశలను రంగరించడానికి సునీత తనవంతు ప్రయత్నం చేస్తోంది. కరోనా విపత్తులో భయాలతో బాధలతో విసిగిపోయిన జనానికి ఊరట కలిగించడానికి సునీత తన మధురమైన గాత్రంతో అద్భుతమైన పాటలను పాడటానికి రెడీ అవుతుంది.

అందుకే తనవంతు ప్రయత్నంగా తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గొప్ప రిలీఫ్ ఇవ్వడానికి తన ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి నెటిజన్లకు కోరిన పాటలను పాడుతూ, అలాగే వాళ్ళకు దైర్యం చెప్పబోతుంది. సునీత మాటల్లోనే “ప్రతి రోజు ఒక అరగంట పాటు లైవ్ లోకి వచ్చి మీరు కోరిన పాటలు పాడుతాను, అలాగే ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని జాగ్రత్తలు తీసుకుందాం’ అంటూ సునీత తెలిపింది.

మరి తన అభిమానులకు ప్రామిస్ చేసిన విధంగా ఆమె ప్రతిరోజూ ఒక అరగంట పాటు పాటలు పాడటానికి సోషల్ మీడియాలోకి వస్తే సునీత ఫ్యాన్స్ కు మంచి కిక్ వచ్చినట్టే. ఇక సునీత చారిటీకి, అలాగే సమాజానికి ఉపయోగపడే పనుల పై ఆమె తన ఫోకస్ పెడుతున్నట్లు చెబుతుంది.