SIIMA Awards: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ (సైమా) 10వ అవార్డుల ప్రధానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈసారి వేడుకలను సెప్టెంబర్ 10, 11వ తేదీల్లో బెంగళూరులో జరుపబోతున్నారు. సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2021లో విడుదలైన నాలుగు భాషలకు చెందిన సినిమాలపై నామినేషన్స్ బయటపెట్టారు.

తెలుగు నుంచి పుష్ప తగ్గేదేలే అంటూ అవార్డుల్లో నామినేట్ అయిపోయింది. తమిళం నుంచి ‘కర్ణన్’, కన్నడ నుంచి ‘రాబర్ట్’, మలయాళం నుంచి ‘మిన్నల్ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయి.
తెలుగులో రిలీజ్ అయ్యి ప్యాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటిన ‘పుష్ప’ సినిమా ఏకంగా 12 నామినేషన్స్ తో అగ్రస్థానంలో నిలిచింది. బోయపాటి శ్రీను తీసిన ‘అఖండ’ మూవీ 10 నామినేషన్స్ తో రెండో స్థానంలో, ఉప్పెన, జాతిరత్నాలు చిత్రాలు 8 నామినేషన్స్ తో మూడోస్థానంలో నిలిచాయి.
ఇక తమిళంలో మారి సెల్వరాజ్ తీసిన ‘కర్ణన్’ మూవీ 10 నామినేషన్స్ దక్కించుకొని టాప్ లో నిలిచింది. నెల్సన్ ‘డాక్టర్’ మూవీ 9 నామినేషన్స్ తో ద్వితీయ స్థానంలో.. మాస్టర్, తలైవి చిత్రాలు ఏడేసి నామినేషన్స్ తో మూడో స్థానంలో ఉన్నాయి.
ఇక కన్నడలో తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ‘రాబర్ట్’ మూవీ 10 నామినేషన్స్ తో ఫస్ట్ ప్లేసులో ఉంది. రాజ్ బి శెట్టి డైరెక్ట్ చేసిన ‘గరుడ గమన వృషభ వాహన’ 8 నామినేషన్స్ తో ద్వితీయ స్థానంలో, యువరత్న 7 నామినేషన్స్ తో తృతీయ స్థానంలోనూ ఉన్నాయి.
మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళీ’ 10 నామినేసన్స్ ప్రథమ స్తానంలో నిలిచింది. ‘కురూప్’ 8 నామినేషన్స్ తో మూడోస్థానం దక్కించుకున్ానయి. ఈ మొత్తం నామినేషన్స్ నుంచి విన్నర్స్ ను ఆన్ లైన్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి అవార్డులను అందిస్తామని.. ప్రేక్షకులు సైమా వెబ్ సైట్ కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని బృందా ప్రసాద్ తెలిపారు.