Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వరకు ఎవరుంటారో చిలక జోస్యం చెబుతున్న షకీలా…

మొత్తానికి ఫైనల్స్ వరకు ఎవరు వెళ్తారు అన్న విషయం షకీల కాన్ఫిడెంట్గా వెల్లడించడం స్క్రీన్ పై చూస్తున్న నాగార్జునకు కూడా ఓ రేంజ్ షాక్ తగిలింది.

Written By: NARESH, Updated On : September 10, 2023 3:44 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7…. ప్రస్తుతం అందరి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో. ఈసారి షో ను తెగ హైలెట్ చేయడానికి మేకర్స్ కింద మీద పడుతున్నారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రతిదీ తలకిందులుగా చేస్తూ ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్ ని కూడా సడన్ షాక్ కి గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇలా హౌస్ లోకి ఎంటర్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరు టాలీవుడ్ ఫేమస్ షకీలా. సినిమాల్లో హాట్ రోల్స్ ప్లే చేసే షకీలా ఇప్పుడు సడన్గా నిన్న ఎపిసోడ్లో చిలక జోస్యం చెప్పడం మొదలుపెట్టింది. నిన్న ఎపిసోడ్ ను యధావిధి మొదలుపెట్టిన నాగార్జున ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం అని స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే ఆట సందీప్.. అమర్దీప్ చౌదరి …పల్లవి ప్రశాంత్ తో కూర్చొని ముచ్చటిస్తున్న షకీలా చెప్పిన మాటలు ఆమెకు భవిష్యత్తు కూడా తెలుసా అన్న డౌట్ కలిగిస్తాయి.

మీరేం భయపడకండి ఫైనల్స్ వరకు మీరు తప్పకుండా వెళ్తారు అని భరోసా ఇస్తోంది షకీలా. బిగ్ బాస్ షో ప్రారంభంలో అందరూ తెగ కలివిడిగా ఒకరినొకర ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇక విషయం అక్కడితో ఆగదు కదా ..నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఎవరికి తగ్గ రాజకీయాలు వాళ్ళు చేస్తూ చిన్నచిన్న గ్రూపులుగా ఫామ్ అయిపోయారు. ఇలా ఫామ్ అయినా ఒక చిన్న గ్రూప్ ను షకీలా మైంటైన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

దానికి తోడు ఆమె చుట్టూ చేరిన కంటెస్టెంట్స్ కూడా.. పంచతంత్ర కథల్లో పిల్లి మాటలు వినే పక్షుల్లాగా తెగ సంతోష పడిపోతున్నారు. అక్కడ చేసేదంతా డ్రామా అని …పైన ఒకటి లోపల ఒకటి అని ..చూసే ప్రేక్షకులకు తెలిసినంత మాత్రం ఉన్న కంటెస్టెంట్స్ కి అర్థం కావడం లేదు. ఏదేమైనాప్పటికీ మొత్తానికి ఫైనల్స్ వరకు ఎవరు వెళ్తారు అన్న విషయం షకీల కాన్ఫిడెంట్గా వెల్లడించడం స్క్రీన్ పై చూస్తున్న నాగార్జునకు కూడా ఓ రేంజ్ షాక్ తగిలింది.