Yamuna: తొలి సారి దర్శకుడు బాలచందర్ సినిమాలో కనిపించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రతిభ కనపరుస్తున్న నటి యమున. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలచందర్ సినిమా తర్వాత సరైన అవకాశాలు రాలేదని అన్నారు పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలు మాత్రమే ఇస్తామని అన్నట్లు పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం హీరోయిన్ అవుతానని పట్టు పట్టుకొని కూర్చున్నట్లు యమున వివరించారు. ఆ తర్వా తన నటన చూసి మౌనపోరాటంలో ఛాన్స్ ఇచ్చారని.. కాస్త ఇబ్బంది అనిపించినా.. ఆ సినిమాలో బ్లౌజ్ లేకుండా నటించినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత తనకు ఫైర్ బ్రాండ్ అనే పేరు రావడానికి గల కారణాలను వివరిస్తూ. కోపమొచ్చినా, సంతోషమొచ్చినా వెంటనే చూపించే తత్వం తనదని పేర్కొన్నారు. దానివల్లే తనకు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వచ్చిందని తెలిపారు. చిరంజీవితో ‘కొదమ సింహం’, మోహన్బాబుతో ‘అల్లుడుగారు’, బాలకృష్ణతో ఓ సినిమా, రాజశేఖర్, శరత్కుమార్, మోహన్లాల్లతో ఇలా చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు యమున తెలిపారు. ప్రస్తుతం సీరియల్స్లో బిజీగా ఉన్నందుకు హాపీగానే ఉన్నట్లు చెప్పారు.
కాగా, ఎవరెవరో ఫొటోలను చూపిస్తూ.. తన భర్త అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని.. అలా చేయొద్దని కోరారు యమున. తను పెళ్లి చేసుకున్నది ఒక్కరినే అని నవ్వుతూ సమాధానమిచ్చారు. కావాలంటే ఫ్యామిలీ ఫొటోలు పంపిస్తానని చెప్పింది.