Homeఎంటర్టైన్మెంట్సమంత కొత్త నిర్ణయాలు

సమంత కొత్త నిర్ణయాలు


తెలుగులో అనుష్క ,కాజల్ , తమన్నా వంటి తారలు సూపర్ ఫార్మ్ లో ఉన్న సమయం లో ” ‘ఏ మాయ చేశావే ” చిత్రం తో టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసిన సమంత తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ” బృందావనం ” , “దూకుడు “, ” అత్తారింటికి దారేది ” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకొంది. అదే క్రమంలో నాగ చైతన్య ని పెళ్ళాడి అక్కినేని వారి కోడలు అయ్యింది. విచిత్రంగా పెళ్లయ్యాక కూడా ” రంగస్థలం , మహానటి , మజిలీ , ఓ బేబీ ” వంటి వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది

స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

కాగా నిన్న 34 వ పుట్టినరోజు జరుపుకున్న సమంత కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుందట. దాంట్లో మొదటిది ఇక మీదట సోషల్ సర్వీస్ ఆక్టివిటీస్ ను పెద్ద ఎత్తున చేయాలను కోవడం ఒకటైతే ,రెండోది ఈ సంవత్సరం ఓ సొంత నిర్మాణ సంస్థ ను పెట్టి , కొత్త దర్శకులతో కథాబలం ఉన్న సినిమాలను తీయాలని అనుకోవడం … అన్నపూర్ణ బ్యానర్ ఉన్నప్పటికీ సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించడానికి కారణం లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే సమంత నిర్మించాలనుకుంటున్నదట .” ఓ బేబీ , యూ టర్న్” వంటి కొత్త తరహా కథల పైనే దృష్టి సారించ బోతోందట …ఆ క్రమంలో ఇపుడు రీసెంట్ గా కన్నడ లో హిట్ అయిన “దియా ” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉంది . కాగా ఇదొక పాటలు లేని ప్రేమ కదా చిత్రమట….అందుకే పునర్ నిర్మించాలని అనుకొందట ….

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular