Samantha: అమెరికాలో సమంత క్రేజ్… జస్ట్ చూసేందుకు రూ. 2 లక్షల టికెట్!

తాజాగా న్యూయార్క్ లో ఖుషి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సమంత ఛార్జ్ చేశారట. సాధారణంగా చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనేందుకు హీరోయిన్స డబ్బులు తీసుకోరు. కేవలం ఖర్చులు మాత్రం వసూలు చేస్తారు.

Written By: Raj Shekar, Updated On : August 26, 2023 12:34 pm

Samantha

Follow us on

Samantha: ఎక్కడికి వెళ్లినా పని, సంపాదన వదలడం లేదు సమంత. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అమ్మడు ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. యూఎస్ లో సమంత చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఆమె లేడీ ఓరియెంట్ మూవీ బేబీ ఏకంగా వన్ మిలియన్ వసూళ్లు అధిగమించి రికార్డులకు ఎక్కింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ వన్ మిలియన్ చేరుకోవడం గొప్ప విశేషం. దీంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన సమంత చేత ఖుషి చిత్ర ప్రమోషన్స్ చేయిస్తున్నారు. అదే సమయంలో డబ్బులు ఆర్జిస్తున్నారు.

తాజాగా న్యూయార్క్ లో ఖుషి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సమంత ఛార్జ్ చేశారట. సాధారణంగా చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనేందుకు హీరోయిన్స డబ్బులు తీసుకోరు. కేవలం ఖర్చులు మాత్రం వసూలు చేస్తారు. అయితే న్యూయార్క్ ఈవెంట్ కి సమంత రూ. 30 లక్షలు తీసుకున్నారట. నిర్వాహకులు కూడా తక్కువేం తినలేదు. ఈవెంట్ కి హాజరయ్యే వాళ్ల దగ్గర నుండి టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేశారట.

టికెట్ ధర రూ. 2 నుండి 12 వేలుగా నిర్ణయించారట. ఇక సమంతను దగ్గరగా చూసేందుకు గానూ రూ. 2 లక్షల రూపాయల టికెట్ పెట్టారట. సమంతను చూడాలన్న కొందరు ఔత్సాహికులు రెండు లక్షలు లెక్క చేయకుండా టికెట్స్ కొన్నారట. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఓ హీరోయిన్ ని చూసేందుకు రూ. 2 లక్షలు అంటే సాధారణ విషయం కాదు కదా… ఇక ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించారు.

ఖుషి చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. అలాగే సమంత సిటాడెల్ టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ హీరో. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇక సమంతకు అమెరికాలో ట్రీట్మెంట్ జరగనునట్లు సమాచారం. కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత ఈ మధ్యలో కొత్త చిత్రాలేవీ చేయరట.