సామ్ జామ్2: రానా, నాగ్ అశ్విన్ సందడి

టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత(సామ్) ఒకరు. అక్కినేని కోడలుగా మారిన తర్వాత కూడా సామ్ సినిమాల్లో బీజీగానే కొనసాగుతోంది. పెళ్లి తర్వాత ఎలాగూ అవకాశాలు తగ్గుతాయని భావించిన సమంత ముందుస్తుగానే ఆ మేరకు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలుగులో ప్రముఖ ఓటీటీగా పేరొందిన ‘ఆహా’లో ఓ కార్యక్రమానికి హోస్టుగా చేసేందుకు ఒప్పుకుంది. ‘ఆహా’లో సమంత చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పటికే టెలికాస్ట్ అయింది. సామ్-జామ్ పేరిట రూపొందిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను […]

Written By: NARESH, Updated On : November 22, 2020 6:48 pm
Follow us on

టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత(సామ్) ఒకరు. అక్కినేని కోడలుగా మారిన తర్వాత కూడా సామ్ సినిమాల్లో బీజీగానే కొనసాగుతోంది. పెళ్లి తర్వాత ఎలాగూ అవకాశాలు తగ్గుతాయని భావించిన సమంత ముందుస్తుగానే ఆ మేరకు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలుగులో ప్రముఖ ఓటీటీగా పేరొందిన ‘ఆహా’లో ఓ కార్యక్రమానికి హోస్టుగా చేసేందుకు ఒప్పుకుంది.

‘ఆహా’లో సమంత చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పటికే టెలికాస్ట్ అయింది. సామ్-జామ్ పేరిట రూపొందిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ విన్పిస్తోంది. సమంత హోస్టుగా చేస్తుందంటే సంథింగ్ స్పెషల్ గా కార్యక్రమం ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ షోపై పెదవి విరుస్తున్నారు.

తొలి షోకు విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొచ్చి హంగామా చేసిన సమంత.. రెండో ఎపిసోడ్ కి చిరంజీవి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా హీరో రానా, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ లు పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆహా టీం సోషల్ మీడియాలో వారికి సంబంధించిన టీజర్ ఫొటోలు షేర్ చేసింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది.