Sai Pallavi: విభిన్న చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరో నాని. వరుస సినిమాలు చేస్తూ నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక నాని ప్రస్తుతం “శ్యామ్ సింగరాయ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో నానికి జోడీగా సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు నటించారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై నాని భారీ అశలు పెట్టుకున్నాడు. ఇటీవలే ఓటీటీలో మాత్రమే ప్రేక్షకులను పలకరించిన నాని.. చాలా రోజుల తర్వాత థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.

కాగా, తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయన్ సాయిపల్లవి మాట్లాడుతూ కంటనీరు పెట్టుకుంది.. ప్రస్తుతం ఈ సీన్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ గురించి సాయి పల్లవి మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. దీంతో.. అభిమానుల ప్రేమను తట్టుకోలేని సాయిపల్లవి ఎమోషన్ అవుతూ స్టేజ్పైనే ఏడ్టేసింది.
ఒక హీరోయిన్ పేరు వినగానే.. ఫ్యాన్స్ ఇంతలా అరవడం చాలా అరుదని అందరూ అంటున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది సాయిపల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏంటో.. కాగా, ఈ సినిమాలో సాయిపల్లవి దేవదాసిగా కనిపించనుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.