ఇక ఈ బయోపిక్ లో రవితేజ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అన్నట్టు ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాలు తీసిన డైరెక్టర్ ‘వంశీకృష్ణ’ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. నిజానికి ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలవ్వాలి.
మొదట ఈ సినిమాలో రానాని హీరోగా అనుకున్నారు. రానా కూడా సినిమా చేయడానికి అంగీకరించాడు. రానా పై కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా చేశారు. అయితే, షూట్ చేసిన తరువాత ఆ పార్ట్ రానాకీ నచ్చలేదు. దాంతో రానా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను చేయాలనుకున్నారు.
కాకపోతే, బెల్లంకొండ కూడా కథలో లోపాలు ఉన్నాయంటూ.. మొత్తానికి మధ్యలోనే ఈ సినిమా నుండి డ్రాప్ అయిపోయాడు. ఇక అప్పటి నుండి నేటి వరకు ఈ సినిమా హీరో పై అనేక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా రవితేజ గజదొంగ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడట. మరి రవితేజకు ఈ గజదొంగ ఎంతవరకూ హిట్ ని ఇస్తాడా ? సినిమాలో అయితే, హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయట.