Rashi Khanna: మూవీలో ఛాన్స్ కోసం ఆడిషన్స్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చిన… రాశీ ఖన్నా

Rashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమా తోనే ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. ఆ తరవాత వచ్చిన ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది.  అక్కడి నుండి ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయని చెప్పాలి. కానీ రాశీ ఖన్నాను వరుస హిట్లే కరువయ్యాయి. ‘బెంగాల్ టైగర్, హైపర్, శివమ్’ లాంటి ఫ్లాప్స్ ఎదురయ్యాయి. మధ్యలో ‘సుప్రీమ్, జైలవకుశ’ సినిమాలతో […]

Written By: Raghava Rao Gara, Updated On : October 30, 2021 5:09 pm
Follow us on

Rashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమా తోనే ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. ఆ తరవాత వచ్చిన ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది.  అక్కడి నుండి ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయని చెప్పాలి. కానీ రాశీ ఖన్నాను వరుస హిట్లే కరువయ్యాయి. ‘బెంగాల్ టైగర్, హైపర్, శివమ్’ లాంటి ఫ్లాప్స్ ఎదురయ్యాయి. మధ్యలో ‘సుప్రీమ్, జైలవకుశ’ సినిమాలతో మెప్పించి ట్రాక్లో పడిన… ఆక్సిజన్, టచ్ చేసి చూడు’ అంటూ పరాజయాలు పలకరించి ఆమెను డీలాపడేలా చేశాయి.

ఆ తర్వాత 2019లో ‘వెంకీ మామ, ప్రతిరోజూ పండగే’ విజయాలతో బౌన్స్ బ్యాక్ అయినా ‘వరల్డ్ ఫెమస్ లవర్’ ఇచ్చిన షాక్ ఆమెకు గట్టిగా తగిలింది. అయితే ఇప్పుడు తాజాగా ఓ సినిమా కోసం ఆడిషన్స్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది రాశీ. సీనియర్ నటిని అయినప్పటికీ, అజయ్ దేవ్​గణ్ కొత్త సినిమా ఆడిషన్స్​లో పాల్గొన్నానని రాశీఖన్నా చెప్పింది. స్టార్​డమ్​కు రోజులు చెల్లిపోతున్నాయని తెలిపింది.

“ఓ చిత్రంతో నటిగా ఎంతటి విజయాన్ని అందుకున్నా… ప్రతి సినిమాకూ అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తేనే పరిశ్రమలో నిలదొక్కుకోగలగుతాం” అని హీరోయిన్ రాశీఖన్నా అంటోంది. ప్రస్తుతం ఆమె అజయ్‌ దేవగణ్‌తో ‘రుద్ర’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌కు ఎంపిక కావడానికి ముందు తను ఆడిషన్స్‌లో పాల్గొన్నట్లు తెలిపింది.

“స్టార్‌డమ్‌ అనే పదానికి రోజులు చెల్లిపోతున్నాయి. ఎంతటి సీనియర్‌ నటి అయినా.. ఎన్ని విజయాలు వెనకాలున్నా.. ప్రతిదీ తొలి చిత్రం అన్నట్లుగానే కష్టపడాల్సిందే. మనలోని నటిని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిందే. అందుకే నేను సీనియర్‌ నటిని అయినా.. ఎలాంటి పట్టింపులు లేకుండా ‘రుద్ర’ ఆడిషన్స్‌లో పాల్గొని నిరూపించుకున్నాను” అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగచైతన్యతో ‘థ్యాంక్‌ యూ’ సినిమా చేస్తోంది.