Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా కూడా శివ సినిమాతో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కి ఉన్న ప్రత్యేకత మరే డైరెక్టర్ కి లేదనే చెప్పాలి. అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా ఒక పెను సంచలనంగా నిలిచేది. మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక పాయింట్ ను ఎలివేట్ చేస్తూ చూపించేవాడు. ఇక ఈ మధ్య అయితే ఆయన ఎప్పుడు కాంట్రవర్సీలో నిలుస్తున్నాడు.
కానీ ఒకప్పుడు ఆయన చేసినటువంటి సినిమాలు ఇండియాలో ఏ డైరెక్టర్ చేయలేదనే చెప్పాలి. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న రాజమౌళి(Rajamouli) మీద ఆర్జీవీ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. రాజమౌళి వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది సర్వం కొల్పోయిందని ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం మాట్లాడాడు అంటే రాజమౌళి బాహుబలి సినిమాతో రెండు స్టాండర్డ్స్ ని సెట్ చేశాడు.
ఒకటి ఏంటంటే 2000 కోట్ల భారీ కలెక్షన్స్ ని రాబట్టడం అయితే రెండోది బాహుబలి సినిమాతో విజువల్ ఫీస్టుని మనకు చూపించాడు. ఇక దానికి మించి ఎవరు ఏం చేసినా కూడా దాన్ని డామినేట్ చేయలేరు అనేంతలా ఆ సినిమాని తీర్చిదిద్దడంతో ఇప్పుడున్న మేకర్స్ కి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటివి చేస్తే ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తారు అనే ఒక డైలమాలో అయితే పడిపోయారు.
దానివల్ల ఇండస్ట్రీలో సరైన కథలు గాని, సరైన సినిమాలు గాని రావడం లేదంటూ వర్మ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు తో ఒక పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం రాజమౌళి ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు…