
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇతర దేశాల నుంచి భారత్ కు ఎవరైనా వస్తున్నారంటేనే వారిని అనుమానపు చూపులతో చూడవలసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఇప్పటికే విదేశాల నుంచి భారత్ కు వచ్చిన చాలా మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పుడు భారత్ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్కూల్స్, కాలేజీలు, మాల్స్, థియేటర్లు మూసివేయడం జరిగింది.
ఈనెల 27న రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు ఉండటంతో ఇప్పటి నుంచే అభిమానులు అతడి పుట్టినరోజు కోసం ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకుంటున్నట్లు అభిమానులకు ఒక లేఖ ద్వారా తెలియచేసాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలను ప్రజలకు అర్ధమయ్యేలా తెలియచేయండని, సామజిక బాధ్యతను నెరవేర్చితే అదే నాకు మీరిచ్చే అద్భుతమైన గిఫ్ట్ అని లేఖలో పేర్కొన్నాడు. దయచేసి అభిమానులెవరు తన పుట్టినరోజు వేడుకలను జరపవద్దని తెలియచేసాడు. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ తో కలసి రామ్