Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సినిమా పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఓజీ, దేవర, సలార్, కల్కి రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ఊహిస్తే , గేమ్ చేంజర్, హరి హర వీరమల్లు రేంజ్ బుకింగ్స్ ఉన్నాయి.
ఇలా ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడానికి కారణం మేకర్స్ అలసత్వమే అని అంటున్నారు ఫ్యాన్స్. పాటలు , గ్లింప్స్ వీడియో ద్వారా వచ్చిన భారీ హైప్ ని మేకర్స్ క్యాష్ చేసుకోలేకపోయారని, వరుసగా వాయిదాలు పడడం వల్ల సినిమా మీద గతం లో ఉన్నటువంటి హైప్ ఆవిరి అయిపోయిందని, ఇప్పుడు మళ్లీ బజ్ క్రియేట్ చేయడానికి మూవీ టీం ఎలాంటి ప్రొమోషన్స్ చేయడం లేదని , రామ్ చరణ్ కనీసం పట్టించుకోవడం లేదని , ఇతర పాన్ ఇండియన్ హీరోలకు ఉన్నటువంటి కసి ఈయనతో లేదని అభిమానులు బాధపడుతున్నారు. వాళ్ళ ఆవేశం లో కూడా అర్థం ఉంది కానీ, ఫైనల్ ఔట్పుట్ బెస్ట్ గా ఉంటేనే కదా సినిమా కి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది లాంగ్ రన్ భారీ లెవెల్ లో ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.
హైప్ తగ్గడం వల్ల ఓపెనింగ్స్ పై ప్రభావం పడొచ్చు, కానీ ఆడియన్స్ , ప్రేక్షకులు జీవితాంతం గుర్తుపెట్టుకునే రేంజ్ లాంగ్ రన్ కావాలంటే , ఔట్పుట్ కోసం కొన్ని కచ్చితమైన అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది, అందుకే వాయిదా వేశారని అంటున్నారు. ప్రొమోషన్స్ ఏ మూవీ కి కూడా మేకర్స్ ప్రతీ రోజు భారీ లెవెల్ లో ప్లాన్ చేయలేదు. కానీ ‘పెద్ది’ కి రాబోయే రోజుల్లో బోలెడన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది, భోపాల్ లో గొప్ప మ్యూజికల్ ఈవెంట్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది , దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ ప్రమోషనల్ ప్లాన్ ఉంది , కచ్చితంగా ఈ నెల 18 నుండి ‘పెద్ది’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరుగుతాయని బలమైన నమ్మకం తో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు , మరి ఏమి జరగబోతుందో చూడాలి.