RRR: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ అనే మాట తప్ప ఇంకేం వినిపించడం లేదు. అంతలా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. తారక్, రామ్చరణ్ వంటి స్టార్ హీరోలతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ను సృష్టిస్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరు 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లలో దూసుకువెళ్తోంది ఆర్ఆర్ఆర్ టీం.

కాగా, రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో హీరో ఇంట్రడక్షన్ మాములుగా ఉండదు. అలాంటిది ఇద్దరు హీరోలను ఏ రేంజ్లో పరిచయం చేయనున్నాడనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించారట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడని ఆయన.. ఈ విషయంపై గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
రామ్చరణ్ను పరిచయం చేసే సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలవనుందట. ఇందుకోసం ఏకంగా 2వేల మంది జూనియర్ ఆర్టిస్టులను రంగంలోకి దింపినట్లు వివరించారు. ఈ సీన్ తీసేటప్పుడు నేనే చాలా ఎగ్జైట్ అయిపోయా.. ఇక ప్రేక్షకులు చూస్తే అసలు కుర్చీల్లోకూర్చోరు. ఈ సినిమాలో ఒక సీన్ను మించి మరో సీన్ ఉంటుంది. అయినా, రామ్చరణ్ ఇంట్రడక్షన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది.. అని రాజమౌళి చెప్పుకోచ్చారు.