అయితే, తాజాగా కోర్టు రాజ్ కుంద్రాకు 50 వేల రూపాయల పూచీకత్తు పై బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ కుంద్రా హాట్ షాట్స్, బాలీ ఫేమ్ వంటి అశ్లీల చిత్రాల యాప్స్ బిజినెస్ చేస్తూ దొరకడంతో అతను చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అలాగే న్యాయ వ్యవస్థ కూడా రాజ్ కుంద్రా పై కఠిన చర్యలు తీసుకునేలా అడుగులు వేయడంతో ఇక ఈ కేసు నుంచి అతను ఇప్పట్లో బయటపడేలా కనబడటం లేదు. మరోపక్క శిల్పాశెట్టి నుంచి ప్రస్తుతం రాజ్ కుంద్రాకు సపోర్ట్ దొరకడం లేదు. రాజ్ కుంద్రా బిజినెస్ గురించి తనకు ఏమి తెలియదు అని శిల్పా శెట్టి భర్త కేసును పటించుకోవడం కూడా మానేసింది.
పైగా శిల్పాశెట్టి టీవీ షోలు, యోగా కార్యక్రమాలతో బిజీగా ఉంది. మొత్తానికి ఫైనల్ గా శిల్పా శెట్టి తన భర్త నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. త్వరలోనే తన విడాకులకు సంబంధించి అధికారికంగా కూడా ప్రకటిస్తోందట. అందుకే ఆమె మళ్ళీ ఇన్ స్టాగ్రామ్ లలో ఫోటోలు అప్ లోడ్ చేస్తూ సరదాగా గడుపుతుంది. గణేష్ పండుగను కూడా ఘనంగా ఉల్లాసంగా జరుపుకుంది.