
కరోనా ప్రవాహంలో కొట్టుకుపోలేక షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు సినిమా వాళ్ళు. అయితే ఇప్పటికే నాలుగు నెలలు అయింది మేకప్ వేసుకుని మన స్టార్ హీరోలు. అందుకే స్లోగా షూటింగ్ కోసం కసరత్తులు చేస్తోన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ లిస్ట్ లో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాసే ముందుగా చేరేలా ఉన్నాడు. తన ‘రాధే శ్యామ్’ కోసం షూట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి ఇప్పటికే ఓ భారీ హాస్పిటల్ సెట్ వేశారు. ఇప్పుడు ఇదే సెట్ లో షూట్ చేయనున్నారు. అయితే చాలా తక్కువ సిబ్బంది ఉండేలా షూట్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: బర్త్డే వేడుకలు వద్దన్న మహేష్.. గిఫ్ట్ రెడీ చేస్తున్న తమన్
ఈ నెల 25 నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై షూట్ జరగనుంది. ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ సీన్స్ లో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని, అలాగే క్లైమాక్స్ కూడా చాలా భావోద్వేగంతో సాగుతూ ఎమోషనల్ గా ఉంటుందని.. సినిమాలో ప్రభాస్ వి రెండు క్యారెక్టర్స్.. అందులో ఒక క్యారెక్టర్ చనిపోతుందని మేము ఇంతకు ముందే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్స్ నే తీయబోతున్నారు.
Also Read: రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ !
కాగా హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయింది. మరి రాధాకృష్ణ ఈ సినిమాని ఎలా తీస్తాడో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.