యూరప్ లో చిక్కుకుపోయిన మళయాళ స్టార్

కరోనా మహమ్మరితో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. కరోనా దాటికి చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. దీంతో ఇతర దేశాలకు చెందిన వాళ్లు అవస్థలు పడుతున్నారు. ఇటీవల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన మలయాళ స్టార్ యూరప్ లో చిక్కుకుపోవడం కలవరానికి గురిచేస్తుంది. దేశంలో లాక్డౌన్ విధించక ముందే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ అతడి తాజా చిత్రం షూటింగ్ కోసం యూరప్ లోని జోర్దాన్ దేశానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక కరోనా […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 8:00 pm
Follow us on

కరోనా మహమ్మరితో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. కరోనా దాటికి చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. దీంతో ఇతర దేశాలకు చెందిన వాళ్లు అవస్థలు పడుతున్నారు. ఇటీవల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన మలయాళ స్టార్ యూరప్ లో చిక్కుకుపోవడం కలవరానికి గురిచేస్తుంది.

దేశంలో లాక్డౌన్ విధించక ముందే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ అతడి తాజా చిత్రం షూటింగ్ కోసం యూరప్ లోని జోర్దాన్ దేశానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక కరోనా ఎఫెక్ట్ కారణంగా యూరప్ దేశమంతా లాక్డౌన్ చేశారు. దీంతో వారు షూటింగ్ రద్దు చేసుకొని ఇండియాకు తిరిగి రావాలనుకున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో వారు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ స్టార్ హీరోతోపాటు 58వరకు జోర్డాన్లో చిక్కుపోయినట్లు సమాచారం.

వీరందరికీ తిరిగి ఇండియాకు రప్పించేలా చూడాలని దర్శకుడు బ్లెస్సీ భారత ప్రభుత్వానికి, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ కు విజ్ఞప్తి చేశారు. వీరంతా అక్కడ బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. విదేశీయుల్లో షూటింగ్ చేద్దామనుకుంటే వాళ్లు అలా బుక్కపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరుదేశాలు కూడా ఏమి చేయలేని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. యూరప్ కరోనా విభృంబిస్తుండటంతో ఇప్పట్లో అక్కడ లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితులు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..