డైరెక్టర్ అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన మొట్టమొదటి ‘దిగ్దర్శకుడు’ ఆయన, దర్శకరత్న అనే పదానికి పర్యాయ పదం ఆయన. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి.. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన ఆ దిగ్దర్శకుడు ‘డా. దాసరి నారాయణరావు’. ఆయన కుమారులు నేడు చేసుకుంటున్న ఆరోపణలను చూస్తుంటే కచ్చితంగా ఆ మహానుభావుడికి ఈ బాగోతం అంతా అవమానం లాగే అనిపిస్తోంది.
కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?
అత్యధిక చిత్రాల చేసి దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కిన ఆ గొప్పవ్యక్తి.. మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్న ఆ గొప్ప వ్యక్తికి ఇది కచ్చితంగా అవమానమే. ప్రతి సంక్షోభంలోనూ సినీ కార్మికుల పక్షాన నిలిచి వారిని ఆదుకొని వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన దాసరిని.. నేడు టీవీల్లో ఆయన విజువల్స్ మీద ఆయన కుమారుల వివాదాన్ని చూపిస్తూ ఉంటే ఆ దిగ్దర్శకుడి ఆత్మ ఎంత బాధ పడుతుంది.
గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?
కానీ ఇప్పటివరకూ సినీ పెద్దలలో ఈ వివాదం గురించి ఇంకా స్పందించలేదు. ఎంతోమందికి జీవితాలను ఇచ్చిన దాసరి కుటుంబం రోడ్డున పడకముందే సినీ పెద్దలు ఈ సమస్యను పరిష్కరించాలి. కానీ అది సాధ్యమేనా ? దాసరి మరణించిన సమయంలోనే కొంతమంది పెద్దలు ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి కూడా రాలేదని ఓ విమర్శ ఉంది. ఏది ఏమైనా దాసరి భౌతికంగా దూరమయినా ఆయన తీసిన అజరామ సినిమాలు అపురూపం. ఆయన కుమారుల సమస్య త్వరగా తీరిపోవాలని కోరుకుందాం.