https://oktelugu.com/

మ‌హేష్ చెబితేగాని నిజం తెలీదు !

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) త‌ర్వాత రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించడంతో  ఈ సినిమా పై అనేక ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. పైగా కరోనా దెబ్బకు రాజమౌళి ప్లానింగ్ మొత్తం రివర్స్ అయింది. అటు మహేష్ ది కూడా అదే పరిస్థితి. ప్రసుతం […]

Written By: , Updated On : June 27, 2020 / 05:54 PM IST
Follow us on


దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’
(ఆర్ఆర్ఆర్) త‌ర్వాత రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించడంతో  ఈ సినిమా పై అనేక ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు.

పైగా కరోనా దెబ్బకు రాజమౌళి ప్లానింగ్ మొత్తం రివర్స్ అయింది. అటు మహేష్ ది కూడా అదే పరిస్థితి. ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత రాజమౌళి సినిమానా లేక వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడా… ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు మహేష్ కే క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లికి మహేష్ సినిమా చేస్తానని చెప్పాడట.

దాంతో వంశీ పైడిప‌ల్లి ఇంకా స్క్రిప్ట్‌ని చెక్కే పనిలోనే ఉన్నాడు. మ‌రోవైపు పరశురామ్ మాత్రం బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడు. ఈ లోపు క‌రోనా వ‌చ్చి లాక్‌డౌన్ కారంణంగా సినీ పరిశ్ర‌మ మొత్తం ష‌ట్‌డౌన్ అయ్యింది. ఎక్క‌డి సినిమాలు అక్క‌డే ఆగిపోయాయి.

దీంతో ఎలాగూ గ్యాప్ వ‌చ్చింది క‌నుక మ‌రి మహేష్ కొన్ని రోజులు వెయిట్ చేసి, పరుశురామ్ తో సినిమా తరువాత రాజ‌మౌళితో సినిమాను స్టార్ట్ చేస్తాడని లేటెస్ట్ గా ఇండస్ట్రీలో ఒక పుకారు షికారు చేస్తోంది. మరి మ‌హేష్ నుండి క్లారిటీ వస్తే గాని నిజం ఏదనేది తెలీదు.