మళ్ళీ ఇప్పటికీ అంటే.. 2021 జులైలో షూటింగ్ ను ముగించింది. నాలుగేళ్లు ఆగుతూ, సాగుతూ షూట్ జరుపుకున్న ఈ సినిమా కోసం ప్రభాస్ బాహుబలి కన్నా ఎక్కువ టైం పెట్టాడు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ఇది రెండో సినిమా. పైగా భారీ బడ్జెట్. మరి ఈ డైరెక్టర్ సినిమాని ఎలా హ్యాండిల్ చేసాడో చూడాలి. ఇక ఈ సినిమా పూర్తిగా ప్రేమకథా చిత్రం.
గ్రాఫిక్స్, సెట్స్ గట్రా భారీగా ఉండబోతున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రేరణ (పూజ హెగ్డే)కి ప్రాణగండం ఉందని విక్రమాదిత్య (ప్రభాస్) ముందే చెబుతాడట. ఆ తర్వాత ఆమెతోనే అతను ఎలా ప్రేమలో పడ్డాడు ? అసలు చనిపోతుంది అని తెలిసి కూడా ఆమెను ఎందుకు ప్రేమించాడు ? అలాగే ఆమెని ఎలా కాపాడాడు ? అనేది మెయిన్ కథ అట.
ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. అయితే, రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి, బాలీవుడ్ లోనూ డేట్ ను చూసుకోవాలి. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం మూడు డేట్ల ను చిత్రబృందం పరిశీలిస్తోందని.. ఈ మూడింటిలో ఒకదాన్ని ఫైనల్ చేయబోతున్నారని టాక్. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ చివరకు నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో చూడాలి