యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “జాన్ “చిత్రం పూర్తి కాగానే తన తర్వాతి చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట. కాబట్టి,ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం యొక్క విఎఫ్ఎక్స్ కోసం సుమారు 50 కోట్లకు పైగా కేటాయించారట. అందుకు గాను విఎఫ్ఎక్స్ చేయటానికి అతిపెద్ద హాలీవుడ్ సాంకేతిక నిపుణులలో చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా రూపొందుతోంది. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో ఊహించుకోవచ్చు. భారీ తారాగణంతో రూపొందే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందటంతో ఇక ప్రభాస్ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అంతా ఆశిస్తున్నారు.
Great people thinks high