Posani Krishna Murali
Posani Krishna Murali : ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) ని గత నెల 26న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై అత్యంత నీచమైన భాషలో గతంలో మాట్లాడినందుకు గాను ఆయన్ని అరెస్ట్ చేసారు. ముందుగా రైల్వే కోడూరు కి తరలించగా, ఆ తర్వాత పీటీ వారెంట్స్ తో మిగిలిన కేసుల విషయాన్నీ ఆయన్ని కర్నూలు, నర్సరావుపేట, గుంటూరు వంటి జైల్స్ కి తరలించి రిమాండ్ విధించారు. కర్నూల్ జైలు లో ఉండగా దాదాపుగా అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ లభించింది, కానీ మరో కొత్త కేసు మీద ఆయన్ని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నాకు బెయిల్ మంజూరు చేయపోతే అఘాయిత్యం చేసుకుంటాను, నాకు ఆరోగ్యం అసలు బాగలేదు అంటూ జడ్జి ముందు పోసాని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాము.
Also Read : ఎట్టకేలకు పోసానికి బెయిల్.. ఈసారైనా విడుదలవుతారా?
కానీ చట్టం తన పని తానూ చేసుకుంటూ పోయింది, ఈ నెల 26 వరకు గుంటూరు జైలు లో రిమాండ్ విధించింది. దీనిపై బెయిల్ కోసం ఆయన గుంటూరు కోర్టులో పిటీషన్ వేయగా, శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు పోసాని కి బెయిల్ మంజూరు చేసింది. నేడు ఆయన ఏ క్షణంలో అయినా కోర్టు నుండి విడుదల అవ్వొచ్చు. విడుదలైన తర్వాత మీడియా తో మాట్లాడుతాడా లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఇక మీదట రాజకీయాల్లో ఉండను అంటూ నాలుగు నెలల క్రితం అధికారిక ప్రకటన చేసిన పోసాని, ఇప్పుడు తనని అరెస్ట్ చేసారు కాబట్టి కూటమి ప్రభుత్వం పై పగతో రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెడుతాడా?, లేదా గతం లో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.
సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన పోసాని, అనవసరంగా రాజకీయాల్లోకి తలదూర్చి ఇక్కట్లు కొని తెచ్చుకున్నాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. పోసాని కి రెండు సార్లు గుండె ఆపరేషన్స్ జరిగింది, గుండెలో ఆయనకు స్టంట్ కూడా వేశారు, నిజంగానే ఆయన ఆరోగ్య పరంగా ఒకప్పుడు ఉన్న విధంగా ఇప్పుడు లేదు, చాలా బలహీనంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఆయనపై జనాల్లో ఎలాంటి జాలీ కలగడం లేదు. వైసీపీ వాళ్ళు అన్యాయంగా పోసానిని అరెస్ట్ చేసారంటూ ఆరోపిస్తున్నప్పటికీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కారణం అతను గతం లో చేసిన అత్యంత నీచమైన వ్యాఖ్యలే. చివరికి చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టలేదు ఆయన, ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే చేసానని రిమాండ్ లో చెప్పుకొచ్చాడు పోసాని, కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, బాధపడింది పోసానియే కదా. ఇక నుండి అయినా ఆయన ప్రశాంతంగా ఉంటాడేమో చూడాలి.
Also Read : పోసాని బెయిల్ పిటీషన్ పై సంచలన తీర్పు..ముగిసిన వాదనలు!