Heroine  Poonam Kaur : గోవిందా..గోవిందా’ అంటూ పవన్ కళ్యాణ్ పై మరో బాంబ్ పేల్చిన ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్!

కాసేపటి క్రితం కూడా ఆయన పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ 'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా..ఇక చాలు. ఇప్పటి నుండి అయినా ప్రజలకు చేయవల్సిన పనుల గురించి ఆలోచించండి. ఈ వ్యవహారం ని ఇంతటితో ఆపేయండి' అంటూ కామెంట్స్ చేసాడు. ఇక పవన్ కళ్యాణ్ ఏమి చేసిన పరోక్షంగా సెటైర్లు వేయడానికి ఒక హీరోయిన్ ఉంది. ఆమెనే పూనమ్ కౌర్.

Written By: Vicky, Updated On : October 1, 2024 7:40 pm

Poonam Kaur Comments

Follow us on

Heroine  Poonam Kaur : పవన్ కళ్యాణ్ విజయం అంటే చాలా మందికి అసూయ, ముఖ్యంగా వైసీపీ పార్టీ కి సపోర్టు చేసే వారు ఆయన విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా?, ఎప్పుడు అతన్ని నెగటివ్ చేద్దామా అనే ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. అందులో కొంతమంది సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. నటుడిగా జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకొని ఉన్నతస్థాయిలో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్, హిందూ మనోభావాలు దెబ్బ తినేలాగా సోషల్ మీడియా లో ఎన్నోసార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బీజేపీ తో చేతులు కలిపినప్పటి నుండి ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన ఆయన తిరుపతి లడ్డు వ్యవహారం లో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుని తప్పుబట్టాడు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాడు. అప్పటి నుండి ప్రకాష్ రాజ్ ప్రతీ రోజు తన ట్విట్టర్ అకౌంట్ ని పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి ఉపయోగిస్తూ వచ్చాడు.

కాసేపటి క్రితం కూడా ఆయన పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా..ఇక చాలు. ఇప్పటి నుండి అయినా ప్రజలకు చేయవల్సిన పనుల గురించి ఆలోచించండి. ఈ వ్యవహారం ని ఇంతటితో ఆపేయండి’ అంటూ కామెంట్స్ చేసాడు. ఇక పవన్ కళ్యాణ్ ఏమి చేసిన పరోక్షంగా సెటైర్లు వేయడానికి ఒక హీరోయిన్ ఉంది. ఆమెనే పూనమ్ కౌర్. ఈమె వైసీపీ కి సపోర్టు గా ఎన్నో ట్వీట్లు ఎన్నికల సమయంలో వేసింది. పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ పరోక్షంగా ఎన్నో కామెంట్స్ కూడా చేసింది. నిన్న సుప్రీమ్ కోర్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి కొన్ని సమాదానాలు కోరుతూ వివరణ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి వైసీపీ పార్టీ కి సంబంధించిన వాళ్ళు చేసిన హడావుడి ఎలాంటిదో నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాం. సుప్రీమ్ కోర్టు సీఎం జగన్ ని నిర్దోషిగా ప్రకటించినట్టు, లడ్డు తయారీలో లో ఎలాంటి కల్తీ నెయ్యిని వాడలేదు అని సుప్రీమ్ కోర్టు తుది తీర్పుని ఇచ్చినట్టుగా బిల్డప్స్ ఇచ్చారు. దీనికి పూనమ్ కౌర్ కూడా స్పందిస్తూ ‘గోవిందా..గోవిందా’ అంటూ వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్న ఫోటోని అప్లోడ్ చేసింది.

దీని అర్థం ‘నువ్వు ఉన్నావు దేవుడా..మా జగన్ అన్నని నిర్దోషిగా నిరూపించావు. భక్తి పేరు తో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వారికి బుద్ధి చెప్పావు’ అన్నట్టు దాని అర్థం అన్నమాట. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెకు అటెన్షన్ ఇవ్వడం ఎప్పుడో ఆపేసారు, కానీ ఆయనకు వ్యతిరేకంగా ఉండే వైసీపీ పార్టీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా లో ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. పూనమ్ కౌర్ ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు నెగటివిటీ వచ్చినా ఇలా మధ్యలో వచ్చి అటెన్షన్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. సినిమాల్లో ఎలాగో ఈమెకు అవకాశాలు రావడం లేదు, కనీసం ఆడియన్స్ నన్ను ఇలా అయినా గుర్తుపెట్టుకోండి అనుకునేందుకే ఆమె ఇలాంటి ట్వీట్స్ వేస్తుంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.