పవన్ కళ్యాణ్.. ‘ఓం శివమ్’ !

డైరెక్టర్ క్రిష్ కి ఇండస్ట్రీ హిట్ సినిమాలు లేకపోవచ్చు.. కానీ, అతని సినిమాల లిస్టులో మంచి చిత్రాలు ఉన్నాయి. అందుకే సరైన సూపర్ హిట్ సినిమా తన కెరీర్ లో లేకపోయినా.. టాలీవుడ్ సెన్స్ బుల్ డైరెక్టర్ గా క్రిష్ కి డీసెంట్ నేమ్ ఉంది. ఇక అలాంటి డైరెక్టర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అందరూ థ్రిల్ అయ్యారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే పండుగే చేసుకున్నారు. అయితే ఈ సినిమా […]

Written By: admin, Updated On : September 13, 2020 5:47 pm
Follow us on


డైరెక్టర్ క్రిష్ కి ఇండస్ట్రీ హిట్ సినిమాలు లేకపోవచ్చు.. కానీ, అతని సినిమాల లిస్టులో మంచి చిత్రాలు ఉన్నాయి. అందుకే సరైన సూపర్ హిట్ సినిమా తన కెరీర్ లో లేకపోయినా.. టాలీవుడ్ సెన్స్ బుల్ డైరెక్టర్ గా క్రిష్ కి డీసెంట్ నేమ్ ఉంది. ఇక అలాంటి డైరెక్టర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అందరూ థ్రిల్ అయ్యారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే పండుగే చేసుకున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ ఫోన్ అయిందనే రూమర్స్ తప్ప ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘ఓం శివమ్’ అని టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఆల్ మోస్ట్ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసారని టాక్.

Also Read: ‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు !

టైటిల్ లోనే మంచి ఫీల్ ఉండటం, పైగా టైటిల్ పవన్ కి చాల కొత్తగా ఉండటంతో ఈ సినిమాకి ఇదే టైటిల్ పెడితే బాగుండు అని పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక కరోనా కారణంగా ఈ సినిమాకు సంబధించి ఒక పెద్ద మార్పు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ ను మొదట మొరాకోలో భారీ సెట్లలో షూట్ చేయాలని క్రిష్ ప్లాన్ చేసుకునప్పటికీ.. కొంత భాగం అనుకున్న విధంగానే అక్కడే షూట్ చేసినప్పటికీ.. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ షూట్ చేయడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే మొరాకో ఎపిసోడ్ ను హైదరాబాద్‌లోనే భారి సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు.

Also Read: బిగ్ బాస్-4లో తొలి ఎలిమినేటర్ ఎవరంటే?

కాగా హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ఇప్పటికే సెట్స్ వేయటం కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పిరియాడిక్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. జాక్వెలిన్ కి నిజంగా ఇది బంఫర్ ఆఫరే. ఇక సినిమాలో ఆమె పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందని.. పవన్ ను ప్రేమించి, అతని కోసం తన ప్రాణాల్ని కూడా త్యాగం చేస్తోందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు ఫ్యాన్స్ లో సినిమా పై ఆసక్తిని బాగా పెంచుతున్నాయి. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.