పెళ్లి చేసుకున్న ‘పరుగు’ భామ

హీరోయిన్ షీలా పెళ్లి పీఠలెక్కింది. తన భర్తతో పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మాకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. చాలా ఆనందంగా ఉంది. మా నూతన జీవితానికి ఇది ఓ కొత్త రోజు’ అని పోస్టు పెట్టింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా ఒక్కసారిగా పెళ్లిపీఠలెక్కి అభిమానులకు షాకిచ్చింది. షీలా తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో మొత్తంగా 24చిత్రాల్లో నటించింది. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త సంతోష్ రెడ్డితో […]

Written By: Neelambaram, Updated On : March 15, 2020 11:05 am
Follow us on

హీరోయిన్ షీలా పెళ్లి పీఠలెక్కింది. తన భర్తతో పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మాకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. చాలా ఆనందంగా ఉంది. మా నూతన జీవితానికి ఇది ఓ కొత్త రోజు’ అని పోస్టు పెట్టింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా ఒక్కసారిగా పెళ్లిపీఠలెక్కి అభిమానులకు షాకిచ్చింది.

షీలా తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో మొత్తంగా 24చిత్రాల్లో నటించింది. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త సంతోష్ రెడ్డితో షీలా వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇద్దరి బంధువులు, ఆప్తులు సమక్షంలో వివాహ వేడుక జరిగింది. సినిమా పరిశ్రమకు చెందినవారు ఎవరు కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు.

షీలా తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ మూవీలో నటించింది. బన్నీకి జోడీగా నటించి మెప్పింది. రామ్ సరసన ‘మస్కా’, జూనియర్ ఎన్టీఆర్ పక్కన ‘అదుర్స్’లో నటించింది. అలాగే ‘సీతాకోకచిలుక’, ‘రాజుభాయ్’ మూవీల్లో నటించింది. తెలుగులో చివరగా బాలకృష్ణ నటించిన ‘పరమవీరచక్ర’లో నటించింది. ఈ తర్వాత తెలుగు తెరపై కన్పించలేదు. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు పెళ్లిపీఠలపై దర్శనమిచ్చింది ఈ ‘మస్కా’ భామ.