అలాంటి పాత్రలు చేయనంటున్న తెలుగమ్మాయి

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించి అలరించింది. విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన ఈ భామ ఇకపై అలాంటి పాత్రలో నటించనని చెబుతుంది. కెరీర్లో ఆరంభంలో ఐశ్వర్య రాజేష్ అమ్మ పాత్రలు, అక్క పాత్రల్లో నటించింది. తాజాగా ఆమెకు హీరోయిన్ గా భారీ అవకాశాలు వస్తుండటంతో ఇకపై తాను అలాంటి పాత్రలు చేయనంటుంది. ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే అయినప్పటికీ టాలీవుడ్లో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ […]

Written By: Neelambaram, Updated On : March 15, 2020 10:58 am
Follow us on

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించి అలరించింది. విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన ఈ భామ ఇకపై అలాంటి పాత్రలో నటించనని చెబుతుంది. కెరీర్లో ఆరంభంలో ఐశ్వర్య రాజేష్ అమ్మ పాత్రలు, అక్క పాత్రల్లో నటించింది. తాజాగా ఆమెకు హీరోయిన్ గా భారీ అవకాశాలు వస్తుండటంతో ఇకపై తాను అలాంటి పాత్రలు చేయనంటుంది.

ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే అయినప్పటికీ టాలీవుడ్లో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బీజీగా నటిగా మారింది. తెలుగులో ‘కౌశల్య కృష్ణమూర్తి’లో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోయినా ఐశ్వర్య నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులోనూ ఈ భామకు వరకు ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో గతంలో తాను చేసినటువంటి అమ్మ, అక్క పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.

కెరీర్ ఆరంభంలోనే అమ్మ, అక్క క్యారెక్టర్ చేస్తే హీరోయిన్ అవకాశాలు రావడం తగ్గడం సహజం. కానీ ఈ భామకు హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి వరుసగా కుర్ర హీరోల పక్కన ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో ఈ అమ్మడు క్రేజ్ తగ్గట్టుగా నిర్ణయాలను తీసుకుంటుంది. ఐశ్వర్య రాజేష్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.