ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే అయినప్పటికీ టాలీవుడ్లో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బీజీగా నటిగా మారింది. తెలుగులో ‘కౌశల్య కృష్ణమూర్తి’లో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోయినా ఐశ్వర్య నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులోనూ ఈ భామకు వరకు ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో గతంలో తాను చేసినటువంటి అమ్మ, అక్క పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.
కెరీర్ ఆరంభంలోనే అమ్మ, అక్క క్యారెక్టర్ చేస్తే హీరోయిన్ అవకాశాలు రావడం తగ్గడం సహజం. కానీ ఈ భామకు హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి వరుసగా కుర్ర హీరోల పక్కన ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో ఈ అమ్మడు క్రేజ్ తగ్గట్టుగా నిర్ణయాలను తీసుకుంటుంది. ఐశ్వర్య రాజేష్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.